Congress: రేపు సీడబ్ల్యూసీ కీలక సమావేశం.. భారత్ జోడో యాత్ర షెడ్యూల్ ఖరారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CWC Meeting: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) గురువారం భేటీ కాబోతోంది. రేపు సాయంత్రం 5.30 నిమిషాలకు సోనియా అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు రేపు జరగబోయే సీడబ్ల్యూసీ మీటింగ్ లో అధిక ధరలకు వ్యతిరేకంగా ఆగస్టు 28న ఢిల్లీలో రాంలీలా మైదానంలో నిర్వహించబోతోన్న ర్యాలీ గురించి కూడా చర్చించనున్నారు. దీంతో పాటు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న ‘‘ భారత్ జోడో’’ యాత్రపై సీడబ్ల్యూసీలో చర్చించనున్నారు. ముందుగా అక్టోబర్ 2 నుంచి భారత్ జోడో యాత్ర అనుకున్నారు. అయితే.. దీన్ని ముందుగానే ప్రారంభించాలని సెప్టెంబర్ 7కు మార్చారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే సిద్ధం అయింది. దేశ వ్యాప్తంగా మొత్తం 3571 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ యాత్ర సాగనుంది. మొత్తం 148 రోజుల పాటు 68 లోక్ సభ నియోజకవర్గాల్లో 203 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. ఏపీలో మొత్తం 100 కిలోమీటర్ల మేర..4 రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగనుంది. ఏపీలో రెండు లోక్ సభ నియోజకవర్గాలు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల గుండా పాదయాత్ర కొనసాగుతుంది. కన్యాకుమారి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ఆలూరు, తెలంగాణలోని వికారాబాద్ గుండా జమ్మూ వరకు 20 ప్రధాన నగరాలు, పట్టణాలు గుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగనుంది.
Also Read
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
Read Also: National Anthem: జాతీయ గీతం పాడుతూ మధ్యలో మరిచిపోయిన ఎంపీ.. వైరల్ అవుతున్న వీడియో
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి గత కొంత కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతున్నారు. పూర్తి స్థాయి బాధ్యతలను వేరేవారికి అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కోరుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు ఉంటాయని భావించారు. ఇందు కోసం రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ‘ చింతన్ శిబిర్’ నిర్వహించింది. అయితే ఆ సమయంలో కూడా పెద్దగా రాజకీయ నిర్ణయాలు తీసుకోలేదు. తాజాగా ఈ సీడబ్ల్యూసీ మీటింగ్ లో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఏదో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
-
Nagarjuna : టాలీవుడ్’కు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్.. లాస్ట్ మినిట్ టెన్షన్లపై ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!