CAA: సీఏఏ అమలుని నిశితంగా గమనిస్తున్నాం: అమెరికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CAA: భారత్ అమలు చేయనున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు కామెంట్స్ చేస్తున్నాయి. భారత అంతర్గత విషయాల్లో ఎక్కువగా కలుగజేసుకుంటున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి హక్కుల విభాగాలు ఈ చట్టం అమలును మతవివక్ష అంటూ వ్యతిరేకిస్తున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వం అందించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే, ఇందులో ముస్లింలను మినహాయించడంపై పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Also Read
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా సీఏఏ గురించి మాట్లాడింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా ఈరోజు తెలిపింది. సీఏఏ మతస్వేచ్ఛను ప్రభావితం చేస్తుందని భయపడుతున్నారా..? అనే మీడియా అడిగిన ప్రశ్నకు.. భారతదేశం దీనిని ఎలా అమలు చేస్తుందనేదాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఈ రోజు అన్నారు. ‘‘మార్చి 11న పౌరసత్వ (సవరణ) చట్టం నోటిఫికేషన్ గురించి మేము ఆందోళన చెందుతున్నాము. మేము ఈ చట్టాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాము’’ అని చెప్పారు. మత స్వేచ్ఛను గౌరవించడం, అన్ని వర్గాలకు సమానమైన చట్టాన్ని అందించడం ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రమని వెల్లడించారు.
డిసెంబర్ 31, 2014 కంటే ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మతపరమైన హింసను ఎదుర్కొని భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, పార్సీలు, క్రైస్తవులు, బౌద్ధులు వంటి ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని సీఏఏ అందిస్తుంది. వలసదారులకు పౌరసత్వం కోసం దరఖాస్తు అర్హత 11 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు తగ్గించింది. సీఏఏ భారత ముస్లింల పౌరసత్వాన్ని హరించదని, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేంద్ర హోమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!