Loksabaha Elections 2024: గోరఖ్పూర్లో ఓటు వేసిన సీఎం యోగి.. బీజేపీ గెలుపుపై ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికల్లో భాగంగా.. గోరఖ్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శనివారం ఉదయం 7 గంటలకు ఓల్డ్ గోరఖ్పూర్ లోని గోరఖ్నాథ్ (బాలికలు) బూత్ నంబర్ 223లో ఓటు వేశారు. తన ఓటు హక్కును వినియోగించుకుని తన ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఆయన తన బూత్లో తొలి ఓటు వేశారు. అంతకు ముందు.. 2019 లోక్సభ ఎన్నికలు, 2022 అసెంబ్లీ ఎన్నికలు, 2023 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తన బూత్లో మొదటి ఓటు వేశారు.
ఓటింగ్ అనంతరం సీఎం యోగి ఆదిత్యనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏడో విడతలో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల ఓటర్లు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నేడు చివరి దశ ఎన్నికలు జరుగుతున్నాయని.. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లోని 57 స్థానాలకు పోలింగ్ జరుగుతోందని తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని తూర్పు ఉత్తరప్రదేశ్లోని 13 స్థానాలకు కూడా ఈరోజు ఓటింగ్ జరుగుతోందని చెప్పారు. దేశంలోని సామాన్య ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని.. జనతా జనార్దన్ ఆశయసాధనకు అనుగుణంగా రెండున్నర నెలలకు పైగా వివిధ రాజకీయ పార్టీలు జనతా జనార్దన్ ముందు తమ సమస్యలను అందించాయని అన్నారు. ఈరోజు చివరి దశలో మహారాజ్గంజ్, గోరఖ్పూర్, ఖుషీనగర్, డియోరియా, సేలంపూర్, బల్లియా, ఘోసి, ఘాజీపూర్, వారణాసి, చందౌలీ, మీర్జాపూర్, రావత్స్గంజ్ అన్ని స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నాయని తెలిపారు.
Also Read
- Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
Counting Process: ఓట్ల లెక్కింపు.. జీహెచ్ఎంసీ పకడ్బందీ ఏర్పాట్లు..
ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ ఓటర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాని సీఎం యోగి పేర్కొన్నారు. అన్నింటిలో ముఖ్యమైనది.. 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నప్పటికీ, మండుతున్న వేడిలో ప్రజాస్వామ్యంపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఓటర్లందరికీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కాగా.. ప్రధాని మోడీ మరోసారి అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లలో భారతదేశాన్ని మార్చేస్తూ.. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏడేళ్లలో మనకు కొత్త ఉత్తరప్రదేశ్ను చూపించిందని అన్నారు. ఇందులో ఉత్తరప్రదేశ్ భద్రత, వారసత్వంతో పాటు అభివృద్ధిలో కొత్త శకంలోకి ప్రవేశించిందని అన్నారు. జూన్ 4న బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని సీఎం యోగి తెలిపారు.
భారతదేశం నేడు ప్రపంచంలో అతిపెద్ద దేశం, అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. వచ్చే మూడేళ్లలో ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొన్నారు. 2047 నాటికి ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల విభాగంలో భారత్ను చేర్చడం ద్వారా.. ప్రతి వ్యక్తి జీవితంలో సంతోషాన్ని తీసుకురావచ్చని తెలిపారు. జూన్ 4న మరోసారి మోడీ ప్రభుత్వం స్వయం సమృద్ధిగా అభివృద్ధి చెందిన భారతదేశం అనే భావనను సాకారం చేసేందుకు అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని తాము విశ్వసిస్తున్నామని సీఎం యోగి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి