Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ నాయకులకు విచిత్రమైన సమస్య వచ్చి పడిందట. పండగ అన్న మాట వినిపిస్తే చాలు… నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తున్నారట. ఎవరికి వారు పండగల్ని హాయిగా, జాలీగా, కుటుంబ సమేతంగా చేసుకుంటుంటే… వీళ్ళకు మాత్రం అదీఇదీ అని లేదు. ఏదో ఒకటి… పండగ… అన్న మాట వినిపిస్తే చాలు దిగాలుగా ఫేస్లు పెట్టేసి జేబులు తడుముకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలకే…
సీఎం కేసీఆర్ వరుసగా మూడోసారి రాజ్ భవన్ లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ అధినేతతో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇక.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఎట్హోమ్ ప్రోగ్రాంలో కనిపించకపోవడం గమనార్హం.
మహారాష్ట్రలో ఈ మధ్య కాలంలో కొన్ని పట్టణాల్లో గొడవలు జరుగుతున్నాయి. అయితే తరచుగా గొడవలు జరగడానికి ఆయా పట్టణాలకు గతంలో ఉన్న పేర్లను మార్చి కొత్త పేర్లను పెట్టడమే ప్రధాన కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.