Centre Govt: పంట వ్యర్థాలను దగ్ధం చేస్తే భారీ జరిమానా వేస్తాం..
- ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం కేంద్రం కీలక నిర్ణయం..
- పంజాబ్.. హర్యానాలో పంట వ్యర్థాలను దగ్ధం చేస్తే కఠిన చర్యలు..
- భారీగా జరిమానాలు వేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Centre Govt: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం రోజు రోజుకు అధ్వాన్నంగా మారిపోతుంది. ఈ కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాయు కాలుష్యం ప్రభావంతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందికరంగా మారుతోంది. ఈ క్రమంలో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో పంట వ్యర్థాలను తగలబెట్టిన రైతులకు విధించే పెనాల్టీని రెట్టింపు చేసింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు రూ.30,000 వరకు జరిమానాను విధించేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన తక్షణం ఆమల్లోకి వస్తుందని వెల్లడించింది.
Read Also: Oben Rorr EZ: తక్కువ ధరలో పట్టణ ప్రయాణ అవసరాల కోసం వచ్చేసిన ఛార్జింగ్ బైక్
Also Read
కాగా, ఈ నిబంధనల ప్రకారం రెండు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు 5 వేల రూపాయల జరిమానా విధించనుండగా.. 2 నుంచి 5 ఎకరాల మధ్య ఉన్న వారికి రూ.10 వేలు, 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు రూ.30 వేలు జరిమానా విధించనున్నారు. శీతాకాలంలో దేశ రాజధాని ఢిల్లీని వాయకాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్న పంట వ్యర్థాల దహనం ఘటనలపై సుప్రీంకోర్ట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టడంతో.. కేంద్రం ఈ చర్యలు తీసుకుంది.
Read Also: MLA Madhavi Reddy Vs YSRCP: కడప మున్సిపల్ సమావేశం రసాభాస.. మాధవీరెడ్డి వర్సెస్ వైసీపీ
ఇక, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో గాలి నాణ్యత ఈరోజు (గురువారం) భారీగా పడిపోయింది. పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరింది. రాజధాని నగరంలో సగటు వాయు నాణ్యత సూచిక 362గా నమోదు అవ్వగా.. ఢిల్లీలోని అనేక ప్రాంతాలు 400 మార్కును దాటేసింది.

Go
తాజావార్తలు
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!