Rahul Gandhi: “కులగణన”తో మోసం.. నితీష్ కుమార్పై రాహుల్ గాంధీ ఆరోపణ
- ‘‘కుల గణన’’తో బీహార్ ప్రజల్నిమోసం చేశారు..
- సీఎం నితీష్ కుమార్పై రాహుల్ గాంధీ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రజల్ని మోసం చేయడానికే అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో అభివృద్ధి పనులు చేయడానికి కులగణన అనేది చాలా అవసరమని అన్నారు. శనివారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తమ పార్టీ కులగణనకు కట్టుబడి ఉందని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో రాజ్యాంగాన్ని అణగదొక్కాలని చూస్తు్న్నాయని, అణగారిన వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు.
Read Also: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు.. ఛత్తీస్గఢ్లో నిందితుడి అరెస్ట్..
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ‘‘నిజమైన స్వాతంత్ర్యం’’ వ్యాఖ్యలు దేశ రాజ్యాంగానికి విరుద్ధం అని అన్నారు. పాట్నాలోని బాపు సభగర్లో జరిగిన ‘‘సంవిధాన్ సురక్ష సమ్మేళన్’’లో ఆయన మాట్లాడారు. ‘‘ఈ దేశంలో దళితులు, మైనారిటీలు, సామాజికంగా అణగారిన ప్రజలు 90 శాతం ఉన్నారు, కానీ వారు వ్యవస్థలో భాగం కాదు. అందుకే మేము కుల గణనను డిమాండ్ చేస్తున్నాము’’ అని అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన అనేది ఓబీసీలు, దళితుల భాగస్వామ్యం పరిపాలనలో, ఇతర రంగాల్లో ఎంత మేర ఉందో అని తెలుసుకునేందుకు సాయపడుతుందని చెప్పారు.
కులగణన లక్ష్యం వివిధ కులాల గణన గురించి మాత్రమే కాదని, దేశ సంపదలో వారి భాగస్వామ్యం గురించి తెలుసుకోవడమని అన్నారు. బీహార్ ప్రభుత్వం చేసిన కుల సర్వే ప్రజల్ని మోసం చేయడానికే అని కాంగ్రెస్ నేత ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన వారికి రిజర్వేషన్ 50 శాతం పరిమితి సరిపోదు అని అన్నారు. మెజారిటీ ప్రజల ప్రయోజనం కోసం కాంగ్రెస్ రిజర్వేషన్లను పెంచుతుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు దేశంలోని అన్ని వ్యవస్థల్లోకి చేరాయని, రాజ్యాంగాన్ని కాపాడుకునే వారికి ద్వేషాన్ని వ్యాప్తి చేసే వారికి మధ్య పోరాటం జరుగుతోందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
Nithiin: ఫ్లాప్ల తర్వాత ఫుల్ ఫోకస్.. వరుసగా మూడు సినిమాలతో భారీ కమ్బ్యాక్కు సిద్ధమైన నితిన్!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!