Lok Sabha Elections 2024: యానిమేటెడ్ వీడియో వివాదం.. జేడీ నడ్డా, అమిత్ మాల్వీయాపై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: కర్ణాటకలో బీజేపీ రూపొందించిన యానిమేటెడ్ వీడియో ఒకటిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారనే ఆరోపణపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర, ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయాపై కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన రిజర్వేషన్లనున ముస్లింలకు కేటాయిస్తున్నారనే ఇతివృత్తం ఆధారంగా ఈ వీడియోను రూపొందించారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముస్లింలకు పెద్ద ఎత్తున నిధుల్ని అందిస్తున్నట్లు చూపిస్తున్న ఈ వీడియోను బీజేపీ సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసింది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
మే 4న, శనివారం నాడు బీజేపీ కర్ణాటక యూనిట్ ట్వీట్ చేసిన 17 సెకన్ల యానిమేటెడ్ వీడియోలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను కాదని ముస్లింలకు ఎక్కువ నిధులు ఇస్తున్నట్లుగా సూచిస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక కాంగ్రెస్ లీగర్ యూనిట్ టీమ్ సభ్యుడు రమేష్ బాబు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి నడ్డా, విజయేంద్ర, అమిత్ మాల్వీయాలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ వీడియోకు సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది.
Also Read
- Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
- Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..?
Read Also: Annamalai: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కీలక వ్యాఖ్యలు..
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి రామలింగా రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీకి ఇంగితజ్ఞానం లేదని.. వారి అగ్రనాయకత్వం కూడా అలాంటిదేనని.. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో హిజాబ్, అజాన్, హలాల్ ప్రయోగించారని, అవి సఫలం అవ్వలేదని, ఇప్పుడు వారు మంగళసూత్రం గురించి మాట్లాడుతున్నారరి, ఈసారి వారికి రెండు అంకెల సీట్లను కూడా గెలవని అన్నారు. దీనిపై బీజేపీ నేత అమిత్ మాల్వీయా స్పందిస్తూ.. కాంగ్రెస్ తన హామీలను తానే చెప్పుకోవడం లేదని, వారి మానిఫెస్టోను బీజేపీ ప్రచారం చేస్తున్నందుకు కాంగ్రెస్ కృతజ్ఞతలు చెప్పాలని ఎద్దేవా చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించేందుకు అంగీకరించడంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం మొదలైంది. దీంతో ఇరు పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. కాంగ్రెస్ మానిఫెస్టోని బీజేపీ ముస్లింలీగ్తో పోల్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లిం కోటాను అంగీకరించేది లేదని ఇటీవల ప్రధాని స్పష్టం చేశారు.
The Congress and its ecosystem has filed FIR(s) against BJP’s national and state leadership for this post. Did the Congress expect to slip in draconian promises in their manifesto and not get called out? The Congress should infact thank the BJP for taking their manifesto to the… https://t.co/y65fR6XggF
— Amit Malviya (@amitmalviya) May 5, 2024
తాజావార్తలు
-
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
-
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!