Singer Maithili Thakur: ఆర్జేడీ కంచుకోటలో మైథిలి ఠాకూర్ రాణించగలరా?
- బీహార్లో కొనసాగుతున్న తొలి విడత పోలింగ్
- అలీనగర్ నుంచి జానపద గాయని మైథిలి ఠాకూర్ పోటీ
- ఆర్జేడీ కంచుకోటలో మైథిలి ఠాకూర్ రాణించగలరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైథిలి ఠాకూర్.. జానపద గాయని. అనూహ్యంగా ఈ ఏడాది రాజకీయ ప్రవేశం చేశారు. అలీనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆర్జేడీ అధికారంలో ఉన్న సమయంలో కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది. అప్పటి నుంచి బీహార్తో అంతంత మాత్రంగానే సంబంధాలు ఉన్నాయి. ఇక మైథిలి ఠాకూర్కు సొంత ప్రాంతంలో కాకుండా అలీనగర్ సీటును బీజేపీ కేటాయించింది.
అలీనగర్ చరిత్ర..
డీలిమిటేషన్ కమిషన్ సిఫార్సుల తర్వాత 2008లో అలీనగర్ నియోజకవర్గం ఏర్పడింది. అలీనగర్.. బీహార్లోని దర్భాంగా జిల్లాలోని జనరల్ కేటగిరీ అసెంబ్లీ నియోజకవర్గం. ఇందులో అలీనగర్, తర్దిహ్, ఘనశ్యాంపూర్, మోతీపూర్ పంచాయతీలు ఉన్నాయి. ఇక నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2010లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ వరుసగా రెండు సార్లు ఆర్జేడీ జయకేతనం ఎగరవేసింది. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా బ్రాహ్మణులు, ముస్లింలు, యాదవ్లు ఎక్కువగా ఉంటారు. అయితే మైథిలి ఠాకూర్ బ్రాహ్మణ కావడంతో అలీనగర్ స్థానాన్ని బీజేపీ కేటాయించింది.
Also Read
- Albino Cobra: శ్వేతనాగు రహస్యాలు వింటే వణికిపోతారు.. ఈ తెల్ల పాముల వెనుక దైవ శక్తి ఉందా?
- Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
- Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
ఇది కూడా చదవండి: Bihar Elections: కొనసాగుతున్న ఓటింగ్.. ఎంత పోలింగ్ నమోదైందంటే..!
ఇప్పటి వరకు అలీనగర్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. 2010, 2015లో ఆర్జేడీ నేత అబ్దుల్ బారి సిద్ధిఖీ విజయం సాధించగా.. 2020లో మాత్రం ఎన్డీఏలో భాగమైన వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)కి చెందిన మిశ్రీ లాల్ యాదవ్ గెలుపొందారు. ఆర్జేడీకి చెందిన బినోద్ మిశ్రాను 3,101 ఓట్ల తేడాతో ఓడించి చరిత్ర మార్చారు. ఇప్పుడు ఇదే స్థానాన్ని మైథిలి ఠాకూర్కు కేటాయించారు. ఆర్జేడీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో సింగర్ రాణించగలదా? లేదా? అన్నది ఉత్కంఠ నెలకొంది. ఓటర్లను ఎంత మేరకు తన వైపు తిప్పుకున్నారన్నది నవంబర్ 14 వరకు ఆగాల్సిందే.
ఇది కూడా చదవండి: PM Modi: జంగిల్ రాజ్ పాలనలో అభివృద్ధి శూన్యం.. మళ్లీ ఆ రోజులు కోరుకోవద్దన్న మోడీ
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తొలి విడతగా గురువారం 121 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. రెండో విడతలో భాగంగా మంగళవారం 122 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది.
తాజావార్తలు
-
Tollywood : ఆగస్టులో యుక్తి తరేజా Vs రితికా నాయక్.. ఇద్దరి బ్యూటీల మధ్య గట్టి ఫైట్
-
IND vs ENG 3rd ODI: రోహిత్ శర్మను భయపెడుతున్న లార్డ్స్ గ్రౌండ్.. మరీ ఇంత దారుణమా!
-
Albino Cobra: శ్వేతనాగు రహస్యాలు వింటే వణికిపోతారు.. ఈ తెల్ల పాముల వెనుక దైవ శక్తి ఉందా?
-
72nd National Film Awards : 72వ జాతీయ అవార్డులపై విమర్శలు.. అద్భుతమైన సినిమాలకు నో అవార్డ్స్
-
Mammootty: నాలుగో జాతీయ అవార్డుతో చరిత్ర సృష్టించిన మమ్ముట్టి.. కమల్, చిరంజీవి, అల్లు అర్జున్ శుభాకాంక్షల వెల్లువ
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!