PM Modi: జంగిల్ రాజ్ పాలనలో అభివృద్ధి శూన్యం.. మళ్లీ ఆ రోజులు కోరుకోవద్దన్న మోడీ
- జంగిల్ రాజ్ పాలనలో అభివృద్ధి శూన్యం
- మళ్లీ ఆ రోజులు కోరుకోవద్దన్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జంగిల్ రాజ్ పాలనలో బీహార్లో అభివృద్ధి శూన్యమని.. మళ్లీ ఆ రోజులు ఎవరూ కోరుకోవద్దని ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీహార్లో రెండు విడతలో జరిగే నియోజకవర్గాల్లో గురువారం మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్జేడీ నేతృత్వంలోని విపక్ష కూటమిపై విరుచుకుపడ్డారు.
ఇది కూడా చదవండి: Erika Kirk: ఆ వీడియోను ఎప్పటికీ చూడబోను.. ఎరికా కిర్క్ వెల్లడి
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
‘‘జంగిల్ రాజ్ పాలనలో బీహార్లో జరిగిన అభివృద్ధి రిపోర్ట్ కార్డ్ సున్నా. 1990 నుంచి 2005 వరకు దాదాపు 15 సంవత్సరాలు.ఈ జంగిల్ రాజ్ బీహార్ను నాశనం చేసింది. అప్పట్లో ప్రభుత్వాన్ని నడపడం పేరుతో మిమ్మల్ని దోచుకున్నారు. అందుకే నేను చెప్తున్నాను. ఫిగర్ సున్నాను గుర్తుంచుకోండి. బీహార్లో 15 సంవత్సరాల జంగిల్ రాజ్లో నిర్మించిన ఎక్స్ప్రెస్వేలు, ఫ్లైఓవర్ల సంఖ్య కూడా సున్నా. ఎన్ని వైద్య కళాశాలలు నిర్మించబడ్డాయి జీరో. బీహార్కు ఒక్క ఐఐటీ కూడా రాలేదు. ఒక్క ఐఐఎం కూడా రాలేదు. ఒక తరం భవిష్యత్తును ఆర్జేడీ నాయకులు మ్రింగివేశారు’’ అని మోడీ ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Philippines Typhoon: ఫిలిప్పీన్స్పై విరుచుకుపడ్డ భారీ తుఫాన్.. 241 మంది మృతి
ఎన్డీఏ ప్రభుత్వంలో బీహార్ను అడవి రాజ్యం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు నితీష్ కుమార్ అవిశ్రాంతంగా కృషి చేశారు. 2014లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీహార్ అభివృద్ధి కొత్త ఊపును తీసుకొచ్చింది. పాట్నాలో ఐఐటీ ప్రారంభించబడింది. బోధ్ గయలో ఐఐఎం ప్రారంభించబడింది. పాట్నాలో ఎయిమ్స్ ప్రారంభించబడింది. ఎయిమ్స్ దర్భంగా పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పుడు బీహార్లో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం కూడా ఉంది. ఐఐఐటి భాగల్పూర్లో కూడా ఉంది. బీహార్లో 4 కేంద్ర విశ్వవిద్యాలయాలు కూడా స్థాపించబడ్డాయి.’’ అని మోడీ పేర్కొన్నారు.
ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని.. ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి నిజాయితీతో కట్టుబడి ఉందని చెప్పారు. చొరబాటుదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరిస్తున్నామని.. కానీ ఆర్జేడీ, కాంగ్రెస్ వ్యక్తులు చొరబాటుదారులను రక్షించేందుకు బిజీగా ఉన్నారని ఆరోపించారు. ఇందుకోసం అనేక రకాలైన అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారని.. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.
#WATCH | Araria, Bihar: Prime Minister Narendra Modi says, "A very major challenge stands before these efforts of ours. That challenge is of the infiltrators. The NDA government is engaged with complete honesty in identifying each and every infiltrator and deporting them from the… pic.twitter.com/81KduRyPe4
— ANI (@ANI) November 6, 2025
#WATCH | Araria, Bihar: Prime Minister Narendra Modi says, "In the NDA government, Nitish ji has worked tirelessly to pull Bihar out of jungle raj. After the double-engine government was formed in 2014, Bihar's development has gained new momentum. IIT has opened in Patna, IIM has… pic.twitter.com/8fSvDX1BRl
— ANI (@ANI) November 6, 2025
#WATCH | Araria, Bihar: Prime Minister Narendra Modi says, "In 15 years of jungle raj in Bihar, how many expressways were built – Zero. In 15 years of jungle raj in Bihar, how many bridges were built over the Kosi River – Zero. In 15 years of jungle raj in Bihar, how many tourist… pic.twitter.com/vfK3vIe2dl
— ANI (@ANI) November 6, 2025
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!