Ashwini Vaishnaw: రైలు ప్రమాదంపై రైల్వే మంత్రిని ఏకేస్తున్న ప్రతిపక్షాలు..
- రైలు ప్రమాదంపై రైల్వే మంత్రిని ఏకేస్తున్న ప్రతిపక్షాలు
- అశ్విని వైష్ణవ్ పై కాంగ్రెస్ నేతలు మాటల యుద్ధం
- రాజీనామా చేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని కాంగ్రెస్ నేతలు ఏకేస్తున్నాయి. అశ్విని వైష్ణవ్ పై మాటల యుద్ధం చేస్తున్నారు.. అతను రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ “తప్పు నిర్వహణ”పై ధ్వజమెత్తిన కాంగ్రెస్.. మంత్రి “రీల్సీ చేయడంలో బిజీగా ఉన్నారు”, ప్రజల భద్రత గురించి చర్చించడానికి సమయం లేదని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖను ‘కెమెరాతో నడిచే’ స్వీయ ప్రచార వేదికగా మార్చిందని ఆరోపించారు. “గత 10 సంవత్సరాలలో, మోడీ ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖపై పూర్తి దుర్వినియోగానికి పాల్పడిందని తెలిపారు. భారతీయ రైల్వేను నేరపూరితంగా వదిలివేసినందుకు మోడీ ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తామని ఖర్గే తెలిపారు.
Devara : భారీగా ‘దేవర ‘ థ్రియేటికల్ బిజినెస్..
Also Read
బాలాసోర్లో 290 మందికి పైగా మరణించిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటన జరిగినా..మళ్లీ రైలు ప్రమాదాల నివారణ పట్ల పట్టింపు లేదని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి రైల్వే మంత్రి వైష్ణవ్ రాజీనామా చేయాలని కోరారు. “రైల్ ప్రమాదాల వెనుక తప్పుడు నిర్వహణ, తప్పుడు విధానం, తప్పుడు అడుగులు ఉన్నాయి. ట్రాక్లపై భారం పెరుగుతోంది, భద్రతపై దృష్టి సారించడం లేదు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం నుండి దేశం కోలుకోలేదు. ఇప్పుడు మరో ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
Crime News: అమ్మవారి జాతరలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఆగస్ట్ 2021 నుండి రైలు ప్రమాదాలు, భద్రతా సమస్యల కారణంగా 329 మంది ప్రాణాలు కోల్పోయారని జైరాం రమేష్ ‘X’ లో తెలిపారు. మరోవైపు.. అనేక రైలు ప్రమాదాలు జరిగినా రైల్వే మంత్రికి జవాబుదారీతనం లేదని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే విమర్శించారు. “భారతీయ రైల్వేల ఈ దుస్థితి ఆందోళన కలిగిస్తోంది.. మంత్రికి రీల్స్ తయారు చేయడానికి సమయం సరిపోతుందని” అని ఆమె ట్వీట్ చేసింది. ఆర్జేడీ అధినేత, రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కేంద్ర ప్రభుత్వంపై దాడికి దిగారు. దేశంలో నిత్యం జరుగుతున్న రైల్వే ప్రమాదాలకు బాధ్యులెవరు? ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..