Ashwini Vaishnaw: రైలు ప్రమాదంపై రైల్వే మంత్రిని ఏకేస్తున్న ప్రతిపక్షాలు..
- రైలు ప్రమాదంపై రైల్వే మంత్రిని ఏకేస్తున్న ప్రతిపక్షాలు
- అశ్విని వైష్ణవ్ పై కాంగ్రెస్ నేతలు మాటల యుద్ధం
- రాజీనామా చేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని కాంగ్రెస్ నేతలు ఏకేస్తున్నాయి. అశ్విని వైష్ణవ్ పై మాటల యుద్ధం చేస్తున్నారు.. అతను రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ “తప్పు నిర్వహణ”పై ధ్వజమెత్తిన కాంగ్రెస్.. మంత్రి “రీల్సీ చేయడంలో బిజీగా ఉన్నారు”, ప్రజల భద్రత గురించి చర్చించడానికి సమయం లేదని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖను ‘కెమెరాతో నడిచే’ స్వీయ ప్రచార వేదికగా మార్చిందని ఆరోపించారు. “గత 10 సంవత్సరాలలో, మోడీ ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖపై పూర్తి దుర్వినియోగానికి పాల్పడిందని తెలిపారు. భారతీయ రైల్వేను నేరపూరితంగా వదిలివేసినందుకు మోడీ ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తామని ఖర్గే తెలిపారు.
Devara : భారీగా ‘దేవర ‘ థ్రియేటికల్ బిజినెస్..
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
బాలాసోర్లో 290 మందికి పైగా మరణించిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటన జరిగినా..మళ్లీ రైలు ప్రమాదాల నివారణ పట్ల పట్టింపు లేదని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి రైల్వే మంత్రి వైష్ణవ్ రాజీనామా చేయాలని కోరారు. “రైల్ ప్రమాదాల వెనుక తప్పుడు నిర్వహణ, తప్పుడు విధానం, తప్పుడు అడుగులు ఉన్నాయి. ట్రాక్లపై భారం పెరుగుతోంది, భద్రతపై దృష్టి సారించడం లేదు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం నుండి దేశం కోలుకోలేదు. ఇప్పుడు మరో ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
Crime News: అమ్మవారి జాతరలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఆగస్ట్ 2021 నుండి రైలు ప్రమాదాలు, భద్రతా సమస్యల కారణంగా 329 మంది ప్రాణాలు కోల్పోయారని జైరాం రమేష్ ‘X’ లో తెలిపారు. మరోవైపు.. అనేక రైలు ప్రమాదాలు జరిగినా రైల్వే మంత్రికి జవాబుదారీతనం లేదని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే విమర్శించారు. “భారతీయ రైల్వేల ఈ దుస్థితి ఆందోళన కలిగిస్తోంది.. మంత్రికి రీల్స్ తయారు చేయడానికి సమయం సరిపోతుందని” అని ఆమె ట్వీట్ చేసింది. ఆర్జేడీ అధినేత, రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కేంద్ర ప్రభుత్వంపై దాడికి దిగారు. దేశంలో నిత్యం జరుగుతున్న రైల్వే ప్రమాదాలకు బాధ్యులెవరు? ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!