Ashwini Vaishnaw: రైలు ప్రమాదంపై రైల్వే మంత్రిని ఏకేస్తున్న ప్రతిపక్షాలు..
- రైలు ప్రమాదంపై రైల్వే మంత్రిని ఏకేస్తున్న ప్రతిపక్షాలు
- అశ్విని వైష్ణవ్ పై కాంగ్రెస్ నేతలు మాటల యుద్ధం
- రాజీనామా చేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని కాంగ్రెస్ నేతలు ఏకేస్తున్నాయి. అశ్విని వైష్ణవ్ పై మాటల యుద్ధం చేస్తున్నారు.. అతను రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ “తప్పు నిర్వహణ”పై ధ్వజమెత్తిన కాంగ్రెస్.. మంత్రి “రీల్సీ చేయడంలో బిజీగా ఉన్నారు”, ప్రజల భద్రత గురించి చర్చించడానికి సమయం లేదని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖను ‘కెమెరాతో నడిచే’ స్వీయ ప్రచార వేదికగా మార్చిందని ఆరోపించారు. “గత 10 సంవత్సరాలలో, మోడీ ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖపై పూర్తి దుర్వినియోగానికి పాల్పడిందని తెలిపారు. భారతీయ రైల్వేను నేరపూరితంగా వదిలివేసినందుకు మోడీ ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తామని ఖర్గే తెలిపారు.
Devara : భారీగా ‘దేవర ‘ థ్రియేటికల్ బిజినెస్..
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
బాలాసోర్లో 290 మందికి పైగా మరణించిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటన జరిగినా..మళ్లీ రైలు ప్రమాదాల నివారణ పట్ల పట్టింపు లేదని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి రైల్వే మంత్రి వైష్ణవ్ రాజీనామా చేయాలని కోరారు. “రైల్ ప్రమాదాల వెనుక తప్పుడు నిర్వహణ, తప్పుడు విధానం, తప్పుడు అడుగులు ఉన్నాయి. ట్రాక్లపై భారం పెరుగుతోంది, భద్రతపై దృష్టి సారించడం లేదు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం నుండి దేశం కోలుకోలేదు. ఇప్పుడు మరో ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
Crime News: అమ్మవారి జాతరలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఆగస్ట్ 2021 నుండి రైలు ప్రమాదాలు, భద్రతా సమస్యల కారణంగా 329 మంది ప్రాణాలు కోల్పోయారని జైరాం రమేష్ ‘X’ లో తెలిపారు. మరోవైపు.. అనేక రైలు ప్రమాదాలు జరిగినా రైల్వే మంత్రికి జవాబుదారీతనం లేదని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే విమర్శించారు. “భారతీయ రైల్వేల ఈ దుస్థితి ఆందోళన కలిగిస్తోంది.. మంత్రికి రీల్స్ తయారు చేయడానికి సమయం సరిపోతుందని” అని ఆమె ట్వీట్ చేసింది. ఆర్జేడీ అధినేత, రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కేంద్ర ప్రభుత్వంపై దాడికి దిగారు. దేశంలో నిత్యం జరుగుతున్న రైల్వే ప్రమాదాలకు బాధ్యులెవరు? ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!