PM Modi: రేపు ఎర్రకోట నుంచి నరేంద్ర మోడీ ప్రసంగం.. తొలి ప్రధాని ఆయనే..!
ఇప్పటి వరకు వస్తున్న సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ ఏప్రిల్ 21వ తేదీన సూర్యాస్తమయం తర్వాత ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. సంప్రదాయం ప్రకారం.. ఎర్రకోట యొక్క ప్రాకారము నుండి ప్రధానులు స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కానీ, సిక్కుల మతగురువు తేజ్బహుదూర్400వ జయంతిని పురస్కరించుకుని.. ఎర్రకోటలో సంప్రదాయానికి భిన్నంగా.. సూర్యాస్తమయం తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు నరేంద్ర మోడీ.. అయితే, స్వాతంత్ర దినోత్సవం వేడుకల సమయంలో ప్రసంగించే ప్రదేశంలో కాకుండా మరో ప్రాంతంలో ఈ ప్రసంగం చేయనున్నారు..
Read Also: Guinness World Record: గిన్నీస్ రికార్డుల్లోకి ‘శునకం’.. ఎందుకో తెలుసా..?
Also Read
ఎర్రకోటలోని పచ్చిక బయళ్ల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.. ప్రధాని మోదీ ప్రసంగానికి ఎర్రకోటను వేదికగా ఎందుకు ఎంచుకున్నారు? అనే అంశానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది.. 1675లో తొమ్మిదవ సిక్కు గురువు గురు తేజ్ బహదూర్ మరణశిక్షకు అప్పటి ముఘల్రాజు ఔరంగజేబ్ ఈ ఎర్రకోట నుంచే ఆదేశాలు జారీ చేసిన కారణంగా.. అందుకు ప్రతీకగా ఇక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.. ఎర్రకోట యొక్క ప్రాకారము నుండి ప్రధానులు స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కానీ, ప్రధాని మోడీ గురువారం రాత్రి 9.30 గంటలకు ప్రసంగిస్తారని, ఆయన ప్రసంగం సర్వమత శాంతి, వర్గాల మధ్య సామరస్యం గురించి ఉంటుందని అధికారులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు కాకుండా స్మారక చిహ్నంపై నుంచి మోడీ ప్రసంగించడం ఇది రెండోసారి. 2018లో ఆయన స్మారక చిహ్నం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేత ఆజాద్ హింద్ పౌంజ్ ఏర్పాటు చేసిన 75వ వార్షికోత్సవాన్ని స్మరించుకున్నారు. .ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆయన ప్రసంగించిన విషయం తెలిసిందే.. ఇక, గురువారం జరిగే కార్యక్రమంలో 400 మంది సిక్కు సంగీత కళాకారుల ప్రదర్శనలు ఉండబోతున్నాయి.. ఈ సందర్భంగా మోడీ.. స్మారక నాణెం, తపాలా స్టాంపును కూడా విడుదల చేస్తారని అధికారులు తెలిపారు.
మరోవైపు ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో.. భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.. ఎర్రకోట వద్ద 1,000 మంది ఢిల్లీ పోలీసులు, వివిధ ఏజెన్సీలకు చెందిన బలగాలతో కూడిన బహుళస్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.. ప్రధాని మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించే ప్రదేశంతో సహా ఎర్రకోట ప్రాంగణంలో ఇప్పటికే 100కి పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్ఎస్జీ స్నిపర్లు, SWAT కమాండోలు, గాలిపటాలు క్యాచర్లు, కనైన్ యూనిట్లు మరియు ఎత్తైన భవనాలపై షార్ప్షూటర్లతో సహా భద్రతా రింగ్… మొఘల్ కాలం నాటి కోట వద్ద మోహరిస్తున్నారు.. ఇక, కరోనా కేసులు మళ్లీ పెరుగుతోన్న నేపథ్యంలో.. భౌతిక దూరం నిబంధనలను పాటించడం తప్పనిసరి అంటున్నారు అధికారులు.. శనివారం నగరంలోని జహంగీర్పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా జరిగిన ఘర్షణలో తొమ్మిది మంది పోలీసులు మరియు ఒక పౌరుడు గాయపడిన నేపథ్యంలో.. ఎర్రకోట వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!