Bombay High Court: వివాహ సమస్యలు ప్రస్తుతం ట్రెండ్గా మారాయి.. చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు..
- వివాహ సమస్యలు ప్రస్తుతం ట్రెండ్గా మారాయి..
- చట్టాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు..
- అత్తమామలపై పెట్టిన కేసును విచారిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: తన భర్త నుంచి విడిపోయిన ఒక మహిళ, తన అత్తమామలపై పెట్టిన క్రిమినల్ కేసును బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ కొట్టివేసింది. వివాహ వివాదాలు ప్రస్తుతం ట్రెండ్గా మారాయని, మహిళలను రక్షించడానికి ఉద్దేశించిన చట్టాలు దుర్వినియోగం చేసే ధోరణ పెరుగుతోందని కోర్టు గమనించింది. వివాహాలను రక్షించడానికి, వివాదాలను పరిష్కరించడానికి రూపొందించిన చట్టాలు తరుచుగా దుర్వినియోగం అవుతున్నాయని కోర్టు ప్రస్తావించింది.
‘‘ వివిధ కారణాల వల్ల ఈ రోజుల్లో వివాహ సమస్యలు సమాజంలో ఒక సమస్యగా మారింది. ఈ వివాహ విభేదాల కారణంగా పోరాడుతున్న వారికి చట్టంలో అనేక పరిష్కారాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉన్న చిన్న సమస్య మొత్తం జీవితాన్ని పాడు చేస్తోంది. హిందువుల్లో పవిత్రమైన వివాహాలు ప్రమాదంలో ఉన్నాయి’’ అని న్యాయమూర్తులు నితిన్ సాంబ్రే, ఎంఎం నెర్లికర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Also Read
- Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
- Air India: గాల్లో హడలెత్తించిన ఎయిర్ ఇండియా విమానం.. అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు జారిపోయిన ఫ్లైట్..
- ఒకే రీఛార్జ్లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
Read Also: CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ
గృహహింస చట్టం, హిందూ వివాహాల చట్టం, ప్రత్యేక వివాహాల చట్టాలు పలువురు తరుచుగా దుర్వియోగానికి గురి చేస్తున్న ఫలితంగా, కోర్టులపై భారం పడుతోందని కోర్టు చెప్పింది. ఇదే కాకుండా ఈ సమస్యలు మానసిక, శారీరక వేధింపులు, అంతులేని సంఘర్షన, ఆర్థిక నష్టం, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులపై కోలుకోలేని హాని కలిగించే అనేక కేసులు నమోదవుతున్నాయని ధర్మాసనం తెలిపింది.
మే 2023ల వివాహం చేసుకున్న జంట కేసును విచారిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మహిళ డిసెంబర్ 2023లో నాగ్పూర్లో ఫిర్యాదు చేసింది. వరకట్న నిషేధ చట్టం కింద ఆమె భర్త, ఇద్దరు సోదరిణులు, అత్తామామలపై కేసు నమోదు చేసింది. వరకట్న వేధింపులు, అసహజ లైంగిక సంబంధం,భూమి, ఆస్తి కోసం డిమాండ్ చేసినట్లు ఆమె వారిపై ఆరోపించింది. అయితే, ప్రస్తుతం తమ వివాదాలు అన్ని పరిష్కారమయ్యాయని సదరు మహిళ, ఆమె తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణ రద్దు చేయాలని కోరారు. దీనికి హైకోర్టు అంగీకరించింది. భార్యభర్తలు శాంతియుతంగా జీవించాలనుకుంటే, వారిని ప్రోత్సహించడం కోర్టు విధి అని ధర్మాసనం పేర్కొంది.
తాజావార్తలు
-
Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
-
Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
-
Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!