Mumbai: కోటి మందిని చంపేస్తాం.. నిమజ్జనం వేళ ముంబైకు బాంబ్ బెదిరింపులు
- కోటి మందిని చంపేస్తాం
- నిమజ్జనం వేళ ముంబైకు బాంబ్ బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గణేష్ నిమజ్జనం వేళ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ బాంబ్ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 34 వాహనాల్లో ఆర్డీఎక్స్ పెట్టినట్లుగా వాట్సాప్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్కు వాట్సాప్ హెల్ప్లైన్కు బెదిరింపు వచ్చింది. ఒక కోటి మంది ప్రజలను చంపబోతున్నట్లు సందేశం వచ్చింది. దీంతో పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుని అప్రమత్తమైంది.
ఇది కూడా చదవండి: Trump: యుద్ధాలపై ట్రంప్ కొత్త పలుకు.. ఎన్ని ఆపారో సంఖ్య చెప్పిన అధ్యక్షుడు
Also Read
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
ముంబైలోకి 14 మంది ఉగ్రవాదులు ప్రవేశించారని.. 400 కిలోల ఆర్డీఎక్స్ను నగరంలో పలు వాహనాల్లో అమర్చారని బెదిరింపు సందేశం వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం పోలీస్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే నిమజ్జనం కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గురువారం వచ్చిన బెదిరింపు సందేశంతో అలర్ట్గా ఉన్నట్లు అధికారి చెప్పారు.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ విందులో గూగుల్ వ్యవస్థాపకుడు చిలిపి చేష్టలు.. ఏం చేశాడంటే..!
ఇక బెదిరింపుపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది. ఉగ్రవాద నిరోధక దళం (ATS), ఇతర సంస్థలకు కూడా సమాచారం అందించినట్లు అధికారి తెలిపారు. బెదిరింపు సందేశంలో ‘లష్కర్-ఎ-జిహాదీ’ అనే సంస్థ పేరును పంపించినట్లు అధికారి వెల్లడించారు. శనివారం ముంబైలో భారీగా నిమజ్జనాలు ఉన్నాయి. దీంతో లక్షలాది మంది ప్రజలు తరలిరానున్నారు. ముందు జాగ్రత్తగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు
ఇక ముంబై వాసులు పుకార్లను నమ్మవద్దని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉంటే వెంటనే తెలియజేయాలని పోలీసులు కోరారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
Mumbai Police say, "Traffic Police in Mumbai received threats over their official WhatsApp number. In the threat, a claim has been made that 34 'human bombs' have been planted in 34 vehicles across the city and the blast will shake entire Mumbai. The organisation, claiming to be…
— ANI (@ANI) September 5, 2025
తాజావార్తలు
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!