Hathras Stampede: హత్రాస్ ఘటన.. మృతదేహాలు బాధిత కుటుంబాలకు అప్పగింత
- హత్రాస్ తొక్కిసలాటలో బాధితుల మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగింత
- ఈ మేరకు వెల్లడించిన జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hathras Stampede: హత్రాస్ తొక్కిసలాటలో బాధితులందరి మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ గురువారం వెల్లడించారు. మంగళవారం హత్రాస్లో బోధకుడు నారాయణ్ సకార్ హరి లేదా భోలే బాబా నిర్వహించిన సత్సంగం తర్వాత జరిగిన తొక్కిసలాటలో మొత్తం 123 మంది మరణించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు మృతి చెందారు. దాదాపు 31 మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత 21 మృతదేహాలను ఆగ్రాకు, 28 ఎటాహ్కు, 34 హత్రాస్, 38 మృతదేహాలను అలీఘర్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అన్ని మృతదేహాలను గుర్తించి సంబంధిత కుటుంబాలకు అప్పగించినట్లు ఆశిష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం వరకు గుర్తుతెలియని మూడు మృతదేహాల్లో రెండు అర్థరాత్రి, ఒకటి గురువారం ఉదయం వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడి గుర్తించినట్లు తెలిపారు. చివరి మృతదేహాన్ని కుటుంబసభ్యులు వీడియా కాల్ ద్వారా గుర్తించగా.. వారిని అలీఘర్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు.
Read Also: Hathras Stampede: హత్రాస్ తొక్కిసలాట ఘటన.. ప్రధాన నిందితుడి సమాచారం ఇస్తే రూ.లక్ష రివార్డు
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
హత్రాస్ దుర్ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్ను ఏర్పాటు చేసింది. తొక్కిసలాట వెనుక “కుట్ర” దాగి ఉందనే విషయాన్ని కూడా పరిశీలిస్తోంది. ప్యానెల్ తన నివేదికను రెండు నెలల్లో సమర్పించనుంది. హత్రాస్లోని ఫుల్హరి గ్రామ సమీపంలో ‘సత్సంగ్’ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సత్సంగ్ కార్యక్రమానికి 80,000 మందికి పరిపాలన అనుమతి ఇచ్చినప్పటికీ, 2.50 లక్షల మందికి పైగా ప్రజలు మతపరమైన సమావేశానికి హాజరయ్యారు. ‘ముఖ్య సేవాదార్’ దేవప్రకాష్ మధుకర్, ఇతర నిర్వాహకులపై మంగళవారం సికంద్రరావు పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో నిందితులుగా పేర్కొన్నారు. భోలే బాబా అని పిలువబడే బోధకుడి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. బుధవారం హత్రాస్ను సందర్శించి గాయపడిన వారిని పరామర్శించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఎఫ్ఐఆర్లో నిందితుడిగా భోలేబాబాను ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై ప్రాథమికంగా కేసు నమోదు చేశామని పోలీసులు ఆయనకు తెలిపినట్లు తెలిసింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!