Hathras Stampede: హత్రాస్ తొక్కిసలాట ఘటన.. ప్రధాన నిందితుడి సమాచారం ఇస్తే రూ.లక్ష రివార్డు
- హత్రాస్ తొక్కిసలాట ఘటనలో ఆరుగురు అరెస్ట్
- ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్ సమాచారమిస్తే లక్ష రూపాయల రివార్డు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hathras Stampede: హత్రాస్లో సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం తెలిపారు. వీరంతా సత్సంగాన్ని నిర్వహించే ఆర్గనైజింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. మంగళవారం హత్రాస్లో బోధకుడు నారాయణ్ సకార్ హరి లేదా భోలే బాబా నిర్వహించిన సత్సంగం తర్వాత జరిగిన తొక్కిసలాటలో మొత్తం 123 మంది మరణించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు మృతి చెందారు. దాదాపు 31 మంది గాయపడ్డారు.
Read Also: Rajasthan: కొంపముంచిన సవాల్.. మంత్రి పదవికి లాల్ మీనా రాజీనామా
Also Read
అలీఘర్ ఇన్స్పెక్టర్ జనరల్ శలభ్ మాథుర్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలతో సహా ఆరుగురిని అరెస్టు చేశామని తెలిపారు. వారంతా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, సేవదార్లుగా పనిచేశారని వెల్లడించారు. ఎఫ్ఐఆర్లో ‘ముఖ్య సేవాదార్’ దేవ్ ప్రకాష్ మధుకర్ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. మధుకర్పై సమాచారం ఇస్తే లక్ష రూపాయల రివార్డును పోలీసులు ప్రకటించారు. మధుకర్ అరెస్ట్ కోసం పోలీసులు కోర్టు నుండి నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
బాబా అరెస్టుపై శలభ్ మాథుర్ ఏమన్నారు?
బాబా అరెస్ట్పై ఐజీ శలభ్ మాథుర్ మాట్లాడుతూ.. ఈరోజు ఆరుగురిని అరెస్టు చేశామని, అయితే దర్యాప్తు సాగుతున్న కొద్దీ ఎవరిని అరెస్టు చేయాలో దర్యాప్తు అధికారి నిర్ణయిస్తారని అన్నారు. విచారణలో భోలే బాబా పాత్ర ఉన్నట్లు తేలితే ఆయనపై చర్యలు తీసుకుని అరెస్టు చేస్తామన్నారు. అవసరమైతే, అధికారులు ‘భోలే బాబా’ని కూడా ప్రశ్నించవచ్చు. ఆయన పేరును మాత్రం ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు. కానీ విచారణకు అనుమతి ఉంది. నారాయణ్ సకార్ హరి నేపథ్యంపై పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆయనపై నేరారోపణలు ఉన్న నగరాలకు బృందాలను పంపించారు.
Read Also: Bansuri Swaraj: న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ నియామకం
పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, ఈ కార్యక్రమానికి 80,000 మందికి పరిపాలన అనుమతి ఇచ్చినప్పటికీ, 2.50 లక్షల మందికి పైగా ప్రజలు మతపరమైన సమావేశానికి హాజరయ్యారు. దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక ప్రకారం, వేలాది మంది అనుచరులు ఆశీర్వాదం కోసం, బోధకుడి పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించడానికి వెళుతుండగా, వారిని భోలే బాబా భద్రతా సిబ్బంది నెట్టారు. దాని కారణంగా , చాలా మంది కింద పడిపోయారు, ఫలితంగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటన వెనుక వ్యతిరేక శక్తులు ఉన్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బుధవారం భోలే బాబా ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?