Hathras Stampede: హత్రాస్ తొక్కిసలాట ఘటన.. ప్రధాన నిందితుడి సమాచారం ఇస్తే రూ.లక్ష రివార్డు
- హత్రాస్ తొక్కిసలాట ఘటనలో ఆరుగురు అరెస్ట్
- ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్ సమాచారమిస్తే లక్ష రూపాయల రివార్డు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hathras Stampede: హత్రాస్లో సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం తెలిపారు. వీరంతా సత్సంగాన్ని నిర్వహించే ఆర్గనైజింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. మంగళవారం హత్రాస్లో బోధకుడు నారాయణ్ సకార్ హరి లేదా భోలే బాబా నిర్వహించిన సత్సంగం తర్వాత జరిగిన తొక్కిసలాటలో మొత్తం 123 మంది మరణించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు మృతి చెందారు. దాదాపు 31 మంది గాయపడ్డారు.
Read Also: Rajasthan: కొంపముంచిన సవాల్.. మంత్రి పదవికి లాల్ మీనా రాజీనామా
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
అలీఘర్ ఇన్స్పెక్టర్ జనరల్ శలభ్ మాథుర్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలతో సహా ఆరుగురిని అరెస్టు చేశామని తెలిపారు. వారంతా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, సేవదార్లుగా పనిచేశారని వెల్లడించారు. ఎఫ్ఐఆర్లో ‘ముఖ్య సేవాదార్’ దేవ్ ప్రకాష్ మధుకర్ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. మధుకర్పై సమాచారం ఇస్తే లక్ష రూపాయల రివార్డును పోలీసులు ప్రకటించారు. మధుకర్ అరెస్ట్ కోసం పోలీసులు కోర్టు నుండి నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
బాబా అరెస్టుపై శలభ్ మాథుర్ ఏమన్నారు?
బాబా అరెస్ట్పై ఐజీ శలభ్ మాథుర్ మాట్లాడుతూ.. ఈరోజు ఆరుగురిని అరెస్టు చేశామని, అయితే దర్యాప్తు సాగుతున్న కొద్దీ ఎవరిని అరెస్టు చేయాలో దర్యాప్తు అధికారి నిర్ణయిస్తారని అన్నారు. విచారణలో భోలే బాబా పాత్ర ఉన్నట్లు తేలితే ఆయనపై చర్యలు తీసుకుని అరెస్టు చేస్తామన్నారు. అవసరమైతే, అధికారులు ‘భోలే బాబా’ని కూడా ప్రశ్నించవచ్చు. ఆయన పేరును మాత్రం ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు. కానీ విచారణకు అనుమతి ఉంది. నారాయణ్ సకార్ హరి నేపథ్యంపై పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆయనపై నేరారోపణలు ఉన్న నగరాలకు బృందాలను పంపించారు.
Read Also: Bansuri Swaraj: న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ నియామకం
పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, ఈ కార్యక్రమానికి 80,000 మందికి పరిపాలన అనుమతి ఇచ్చినప్పటికీ, 2.50 లక్షల మందికి పైగా ప్రజలు మతపరమైన సమావేశానికి హాజరయ్యారు. దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక ప్రకారం, వేలాది మంది అనుచరులు ఆశీర్వాదం కోసం, బోధకుడి పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించడానికి వెళుతుండగా, వారిని భోలే బాబా భద్రతా సిబ్బంది నెట్టారు. దాని కారణంగా , చాలా మంది కింద పడిపోయారు, ఫలితంగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటన వెనుక వ్యతిరేక శక్తులు ఉన్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బుధవారం భోలే బాబా ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!