Sanjay Raut : బీజేపీ మైండ్ గేమ్స్ ఆడుతోంది.. యుద్ధం ఇంకా ముగియలేదు.!
- బీజేపీ అంకెల గేమ్ అంటూ రౌత్ ఆగ్రహం
- మేయర్ పీఠం తమదేనని శివసేన ధీమా
- ముంబైలో తీవ్ర ప్రతిష్టాత్మక పోరు
- అర్థరాత్రి ఫలితాలే అసలు ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఫలితాల వేళ మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. ఒకవైపు బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినట్లు కనిపిస్తున్నప్పటికీ, శివసేన (ఠాక్రే వర్గం) మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజా ఫలితాలపై స్పందించిన శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్, బీజేపీ సృష్టిస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ముంబై మేయర్ పీఠం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్, ఎన్నికల ఫలితాల గణాంకాలపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. “బీజేపీ ఉదయం నుంచి తప్పుడు అంకెలు చూపిస్తూ ప్రజల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. పోటీ చాలా తీవ్రంగా ఉంది. మా అభ్యర్థులు వైశాలి పాటంకర్, విశాఖ రౌత్, యశ్వంత్ కిల్లేదార్ వంటి వారు అనేక చోట్ల ముందంజలో ఉన్నారు. బాంద్రా నుంచి రోహిణి కాంబ్లే విజయం సాధించారు. బీజేపీ చూపిస్తున్న అంకెల గారడీని మేము నమ్మడం లేదు” అని రౌత్ వ్యాఖ్యానించారు.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
Sai Pallavi: సాయి పల్లవి సెలక్షన్ తప్పిందా? కొత్త సినిమా పోస్టర్పై భగ్గుమంటున్న ఫ్యాన్స్!
ముంబై నగరానికి శివసేన ఇప్పటివరకు 23 మంది మేయర్లను అందించిందని గుర్తు చేసిన రౌత్, 24వ మేయర్ కూడా శివసేన (UBT) నుంచే ఉంటారని శపథం చేశారు. “ఠాక్రేను సవాలు చేయాలని చూశారు, కానీ దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. మీరు అధికారం , ధన బలంతో కొన్ని సీట్లు గెలిచి ఉండవచ్చు, కానీ ముంబై పోరాటం వేరు. ఇది ఇంకా ముగియలేదు. అర్థరాత్రి వరకు పూర్తి ఫలితాలు వస్తాయి, అప్పుడు అసలు చిత్రం కనిపిస్తుంది” అని ఆయన ఘాటుగా స్పందించారు.
ఈ పోరాటంలో ఎంఎన్ఎస్ (MNS) అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల గెలుస్తున్నారని, శరద్ పవార్ వర్గానికి కూడా కొన్ని సీట్లు దక్కవచ్చని రౌత్ పేర్కొన్నారు. ముంబై వెలుపల బీజేపీ సాధించిన విజయాలకు అభినందనలు తెలుపుతూనే, ముంబైలో మాత్రం శివసేన గట్టి పోటీని ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. చివరి శ్వాస వరకు మేయర్ పీఠం కోసం పోరాడుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతున్నప్పటికీ, ముంబై మేయర్ పీఠం విషయంలో మాత్రం సంజయ్ రౌత్ సవాల్ విసరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అర్థరాత్రి వెలువడే పూర్తి ఫలితాలు ముంబై మున్సిపల్ కోటపై ఎవరు జెండా పాతతారో తేల్చనున్నాయి.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!