BJP: ఆ స్థానాలు, 5 రాష్ట్రాల ఎన్నికలే టార్గెట్.. నడ్డా నేతృత్వంలో బీజేపీ కీలక సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: 2024 లోక్ సభ ఎన్నికలు, ఈ ఏడాది జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి సమాలోచన చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తక్కువ ఓట్లతో ఓడిపోయిన 160 పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేయడంపై చర్చించారు. బీజేపీ రూపొందించిన “లోక్ సభ ప్రవాస్” కార్యక్రమంతో సంబంధమున్న ముఖ్య నేతలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు.
Read Also: WI vs IND: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న విండీస్.. కీపర్ గా ఇషాన్ కిషన్
Also Read
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికల ముందు జరిగే ఈ ఎన్నికల్లో బీజేపీ తప్పక గెలవాలని అనుకుంటోంది. ముఖ్యంగా ఇప్పటికే అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని నిలుపుకోవడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోని రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో గెలవాలని బీజేపీ భావిస్తోంది. ఇక తెలంగాణలో సత్తా చాటాలని అనుకుంటోంది. కర్ణాటక ఎన్నికల పరాజయం తర్వాత ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోవద్దని కృతనిశ్చయంతో బీజేపీ ఉంది.
అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి, పూర్తి సామర్ధ్యం తో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించే విజయం ద్వారా రానున్న సార్వత్రిక లోకసభ ఎన్నికలను ప్రభావితం చేయాలన్నదే బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల ముందు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలే చాలా కీలకమని ప్రస్తుతం బీజేపీ భావిస్తోంది. తాజాగా ఈ రోజు జరిగిన సమావేశానికి పార్టీ కార్యనిర్వాహక సభ్యులు, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
-
Nandini : “ఆమె నా కోడలు కాదు.. కూతురు.. భట్టి సతీమణి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!