Pune: ప్రధాని మోడీకి గుడి కట్టిన బీజేపీ కార్యకర్త మనస్తాపం.. బీజేపీకి గుడ్బై
- ప్రధాని మోడీకి గుడి కట్టిన బీజేపీ కార్యకర్త మనస్తాపం
- బీజేపీకి గుడ్బై చెప్పిన పూణె కార్యకర్త మయూర్ ముండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ భక్తుడు, బీజేపీ వీర విధేయుడు మయూర్ ముండే మనస్తాపం చెందాడు. మోడీపై ఉన్న అభిమానంతో రూ.1.5లక్షలు వెచ్చించి ఆలయాన్ని నిర్మించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే స్థానిక బీజేపీ నేతల తీరుతో ఇబ్బంది పడుతున్నట్లు వాపోయాడు. దీంతో మయూర్ ముండే కమలం పార్టీకి గుడ్బై చెప్పాడు.
ఇది కూడా చదవండి: Hibox Scam: పెట్టుబడి పేరుతో రూ. 500కోట్ల మోసం.. యాప్ ప్రమోట్ చేసిన యూట్యూబర్, నటికి సమన్లు
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
2021లో పూణెలోని ఔంధ్లో ప్రధాని మోడీకి మయూర్ ముండే ఆలయాన్ని నిర్మించాడు. జైపూర్ నుంచి తీసుకొచ్చిన ఎర్ర రాయి, పాలరాయితో ఈ గుడిని నిర్మించాడు. భద్రతా కోసం టఫ్న్డ్ గ్లాస్ను కూడా ఏర్పాటు చేశాడు. ఈ ఆలయ నిర్మాణానికి రూ. 1.5 లక్షలు ఖర్చైంది. ఈ గుడిని ప్రధాని మోడీకి అంకితం చేశాడు. మోడీపై ఉన్న అభిమానంతో గౌరవ చిహ్నంగా ఆలయాన్ని నిర్మించినట్లు ముండే తెలిపాడు. మోడీని తాను ఆరాధిస్తానని చెప్పాడు. ఇతరులు కూడా ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటారన్నారు. ఈ వార్త బీజేపీ జాతీయ నాయకులు చేరింది. నిర్మాణాన్ని తొలగించమని చెప్పారన్నారు. దీంతో మోడీ ప్రతిమను ఆలయం నుంచి తొలగించారు.
ఇది కూడా చదవండి: Satya Prasad: అధికారం లేక పిచ్చి పట్టినట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు..
ఇక తాజాగా స్థానిక నాయకులు.. పార్టీ విధేయులకు ప్రాముఖ్యత ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ముండే వాపోయాడు. దీంతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మోడీ, అమిత్ షా, నడ్డాకు లేఖ రాశాడు. ‘‘నేను బీజేపీకి నమ్మకమైన కార్యకర్తగా ఉన్నాను. ఔంధ్ వార్డు చీఫ్ నుంచి శివాజీనగర్ యువమోర్చా వైస్ ప్రెసిడెంట్ వరకు నేను పార్టీ కోసం అంకితభావంతో పనిచేశాను. అయితే ఇటీవలి కాలంలో బయటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూ విధేయులు విస్మరించారు’’ అని ముండే లేఖలో పేర్కొ్న్నాడు.
ఇది కూడా చదవండి: Nagarjuna: కొండా సురేఖ పై నాగార్జున పరువు నష్టం దావా?
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!