Rajasthan: కాంగ్రెస్ కీలక భేటీ.. సీఎం మార్పుపై అశోక్ గెహ్లాట్ నివాసంలో మీటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress party key meeting in Rajasthan: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ లో చిచ్చు పెడుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉండనున్నారు. దీంతో ఆయన సీఎం పదవిని వదులుకోనున్నారు. అయితే ముందుగా అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవితో పాటు రాజస్థాన్ సీఎంగా కొనసాగాలని అనుకున్నప్పటికీ.. రాహుల్ గాంధీ ‘‘ఒక వ్యక్తికి ఒక పదవి’’ అనేది కాంగ్రెస్ నిర్ణయం అని స్పష్టం చేశారు. దీంతో ఇక గెహ్లాట్ అధ్యక్షుడు అయితే సీఎం పోస్టు వదులుకోవాల్సిందే.
ఇదిలా ఉంటే అశోక్ గెహ్లాట్ సీఎం పదవి వదులుకుంటే.. తదుపరి రాజస్థాన్ సీఎం సచిన్ పైలెట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అశోక్ గెహ్లాట్ ఇంట్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థిత్వంపై సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని తీర్మానం చేయనున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందే తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది.
Also Read
- Kolkata: మమత కట్టడాలపై బుల్డోజర్ చర్య.. సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ శిల్పం తొలగింపు
- Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
- Pregabalin: ప్రెగాబాలిన్ దుర్వినియోగంపై కేంద్రం అలర్ట్.. అమ్మకాలపై ఆరోగ్యశాఖ ఆంక్షలు
Read Also: India vs Australia T20 Match: డూ ఆర్ డై ఫైట్.. ఉప్పల్ వేదికగా నేడు కీలక మ్యాచ్..
ఈ రోజు సాయంత్రం జరిగే సమావేశానికి ఏఐసీసీ ఇంఛార్జ్ అజయ్ మాకెన్ తో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. ఆదివారం కాంగ్రెస్ మీటింగ్ జరగడానికి ముందే శనివారం అజయ్ మాకెన్, సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. రాజస్థాన్ పరిణామాలను అజయ్ మాకెన్, మల్లికార్జున ఖర్గేలు పరిశీలిస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
ఇదిలా ఉంటే సచిన్ పైలెట్ సీఎం పదవి కోసం పావులు కదుపుతున్నారు. కాగా.. సచిన్ పైలెట్ అభ్యర్థిత్వాన్ని ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సచిన్ పైలెట్ కాకుండా.. స్పీకర్ జోషిని ముఖ్యమంత్రిని చేయాలని అశోక్ గెహ్లాట్ కోరుతున్నారు. ఇక కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం అశోక్ గెహ్లాట్, శశి థరూర్ పోటీ పడుతున్నారు. వీరితో పాటు మరికొంత మంది పోటీ చేసే అవకాశం ఉంది. 1998 తరువాత తొలిసారి గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు రాబోతున్నారు.
తాజావార్తలు
-
Kolkata: మమత కట్టడాలపై బుల్డోజర్ చర్య.. సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ శిల్పం తొలగింపు
-
MS Dhoni: ప్లేయర్ కాస్త కోచ్.? చెన్నై సూపర్ కింగ్స్కు కోచ్గా మిస్టర్ కూల్.!
-
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
-
Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
-
Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!