Rajasthan: కాంగ్రెస్ కీలక భేటీ.. సీఎం మార్పుపై అశోక్ గెహ్లాట్ నివాసంలో మీటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress party key meeting in Rajasthan: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ లో చిచ్చు పెడుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉండనున్నారు. దీంతో ఆయన సీఎం పదవిని వదులుకోనున్నారు. అయితే ముందుగా అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవితో పాటు రాజస్థాన్ సీఎంగా కొనసాగాలని అనుకున్నప్పటికీ.. రాహుల్ గాంధీ ‘‘ఒక వ్యక్తికి ఒక పదవి’’ అనేది కాంగ్రెస్ నిర్ణయం అని స్పష్టం చేశారు. దీంతో ఇక గెహ్లాట్ అధ్యక్షుడు అయితే సీఎం పోస్టు వదులుకోవాల్సిందే.
ఇదిలా ఉంటే అశోక్ గెహ్లాట్ సీఎం పదవి వదులుకుంటే.. తదుపరి రాజస్థాన్ సీఎం సచిన్ పైలెట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అశోక్ గెహ్లాట్ ఇంట్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థిత్వంపై సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని తీర్మానం చేయనున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందే తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది.
Also Read
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
Read Also: India vs Australia T20 Match: డూ ఆర్ డై ఫైట్.. ఉప్పల్ వేదికగా నేడు కీలక మ్యాచ్..
ఈ రోజు సాయంత్రం జరిగే సమావేశానికి ఏఐసీసీ ఇంఛార్జ్ అజయ్ మాకెన్ తో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. ఆదివారం కాంగ్రెస్ మీటింగ్ జరగడానికి ముందే శనివారం అజయ్ మాకెన్, సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. రాజస్థాన్ పరిణామాలను అజయ్ మాకెన్, మల్లికార్జున ఖర్గేలు పరిశీలిస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
ఇదిలా ఉంటే సచిన్ పైలెట్ సీఎం పదవి కోసం పావులు కదుపుతున్నారు. కాగా.. సచిన్ పైలెట్ అభ్యర్థిత్వాన్ని ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సచిన్ పైలెట్ కాకుండా.. స్పీకర్ జోషిని ముఖ్యమంత్రిని చేయాలని అశోక్ గెహ్లాట్ కోరుతున్నారు. ఇక కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం అశోక్ గెహ్లాట్, శశి థరూర్ పోటీ పడుతున్నారు. వీరితో పాటు మరికొంత మంది పోటీ చేసే అవకాశం ఉంది. 1998 తరువాత తొలిసారి గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు రాబోతున్నారు.
తాజావార్తలు
-
Japan Releases : జపాన్ మార్కెట్ టార్గెట్ చేస్తోన్న భారతీయ చిత్రాలు
-
Motorola Edge 70 Max: మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ మ్యాక్స్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా, Snapdragon 8 Gen 5 చిప్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
-
Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
-
Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!