Arvind Kejriwal: కేజ్రీవాల్ మామిడి పండ్లు తినడంపై స్పందించి ఆప్.. చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను తీహార్ జైలులో ఉన్నాడు. అయితే జైలులో కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు, ఆలూ పూరీలు తింటున్నాడని, షుగర్ వ్యాధితో బాధపడుతున్న కేజ్రీవాల్ తన షుగర్ లెవల్స్ పెంచుకుని, అనారోగ్య సమస్యలతో బెయిల్ పొందాలని చూస్తున్నారంటూ ఈడీ కోర్టులో ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ సీఎం హత్యకు జైల్లో పథకం రచిస్తు్న్నారని ఆరోపించింది. కేజ్రీవాల్ని చంపేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారంటూ ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు.
Read Also: Lok sabha election: ఎన్నికల వేళ బాలీవుడ్ నటుల డీప్ఫేక్ వీడియోలు.. లేటెస్ట్గా బుక్కైన మరో నటుడు
Also Read
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
‘‘ఇది మోడీ, బీజేపీ చేసిన కుట్ర, కేజ్రీవాల్ని చంపడానికి కుట్ర పన్నారు. జైలులో ఆయనకు ఇంటి భోజనాన్ని నిలిపివేయాలని ఈడీ, బీజేపీ భావిస్తున్నాయి. కోర్టులో అతను స్వీట్లు, టీ తాగుతున్నాడని ఈడీ ప్రస్తావించింది. ఇది పూర్తిగా అబద్ధం’’ అని అతిషి చెప్పారు. కేజ్రీవాల్ రెండు అరటి పండ్లు తినడం అనేది ఈడీ రెండో అబద్ధమని, షుగర్ పేషెంట్లు అత్యవసర పరిస్థితుల్లో చాక్లెట్లు, అరటిపండ్లు తమతో ఉంచుకోవాలని ఎప్పుడూ కోరుతారు. మూడో అబద్ధం ఆలూపూరీ తినడమని ఆమె అన్నారు. ఈడీ సమర్పించిన డైట్ చార్ట్లో కేజ్రీవాల్కి ఒక రోజు మాత్రమే పూరీ ఉందని, అది కూడా నవరాత్రి మొదటి రోజని, అతనికి మీరు నవరాత్రి ప్రసాదాన్ని అనుమతించలేదా..? అని ప్రశ్నించారు.
డయాబెటిక్తో బాధపడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కావాలనే జైల్లో తీపి పదార్థాలు తింటున్నారని, తద్వారా షుగర్ లెవల్స్ పెరిగి వైద్యపరమైన కారణాలతో బెయిల్ పొందాలని చూస్తున్నారని బీజేపీ నేత మజీందర్ సింగ్ సిర్సా అన్నారు. కేజ్రీవాల్ వైద్యపరమైన కారణాలతో జైలులో ‘‘చక్కెర కుంభకోణం’’లో మునిగిపోయారని ఆరోపించారు. మద్యం కుంభకోణం, ఇప్పుడ చక్కెర కుంభకోణానికి పాల్పడుతున్నాడని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..