Gautam Adani: గౌతమ్ అదానీపై అభియోగాలు.. ప్రతిపక్షాల మెడకే చుట్టుకుంటోంది..
- అదానీపై అమెరికా అభియోగాలు..
- పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలను ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధం..
- విపక్షాల మెడకు చుట్టుకుంటున్న వ్యవహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Adani: అదానీ గ్రూపుపై అమెరికా లంచం ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. గౌతమ్ అదానీపై అమెరికా ప్రాసిక్యూటర్లు లంచం, మోసానికి పాల్పడ్డారని అభియోగాలు మోపింది. అమెరికాకు చెందిన అజూర్ పవర్తో కలిసి అదానీ గ్రీన్ ఎనర్టీ, SECIతో 12 GW సౌర విద్యుత్ ఒప్పందాన్ని పొందిందని అభియోగపత్రంలో ఆరోపించింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలను ఖరీదైన విద్యుత్ ఒప్పందాలు అంగీకరించేలా చేయడానికి, ఈ కంపెనీలు భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలకు 256 మిలియన్ డాలర్లు లంచంగా ఇచ్చారని ఆరోపించింది. ఈ చెల్లింపుల్లో ఏపీకి ఎక్కువ వాటా లభించినట్లు సమాచారం.
అయితే, ఈ ఆరోపణలు దేశ రాజకీయాల్లో దుమారం రేపాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అదానీకి, ప్రధాని మోడీకి సంబంధాలు ఉన్నాయని, అతడిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, ఈ ఆరోపణలు తిరిగి కాంగ్రెస్, దాని మిత్రపక్షాల మెడకే చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. అమెరికా అభియోగాలు మోపిన నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, విపక్ష పార్టీల పాలనలోనే ఉన్నాయి. ఈ ఒప్పందాలు జరిగిన సమయంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్, తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే, ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేపీ పాలన ఉంది. ఈ నేపథ్యంలో రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్, ముఖ్యంగా విపక్షాల దాడిని తట్టుకునేందుకు బీజేపీ సంసిద్ధంగా ఉంది.
Also Read
- Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్లో హై-వోల్టేజ్ డ్రామా..
- Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
- Punjab: అమృత్సర్లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
Read Also: Stock Market: ఒక్కరోజు లాభాలకు బ్రేక్.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
1) ప్రత్యర్థి పార్టీలపై బీజేపీ ఆరోపణ: నేరారోపణలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సీఎంలు లేరు. ఆ ప్రభుత్వాలు లంచాలను ఎందుకు అనుమతించాయి..? అని బీజేపీ ప్రతిపక్షాలపై విరుచుకుపడే అవకాశం ఉంది. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాల పాత్రపై సమాధానం చెప్పాలని బీజేపీ నేతలు అడుగొచ్చు.
2) యూఎస్ నేరారోపణలో కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, ఇంకా ఆరోపనలు రుజువు కాలేదని, నేరం రుజువు అయ్యేంత వరకు నిందితులు నిర్దోషులగా భావిస్తారని బీజేపీ చెబుతుంది.
3) నేషనల్ వర్సెస్ ఇంటర్నేషనల్ రాజకీయాలు: భారతదేశ కంపెనీలపై దాడి చేయడానికి విదేశీ నివేదికలపై ప్రతిపక్షాలు ఆధారపడటంపై బీజేపీ ప్రతిపక్షాలను విమర్శించొచ్చు. ఇలాంటి నేరోరపణలను భారతీయ న్యాయచట్టాల పరిధిలో పరిష్కరించాలని వాదించొచ్చు. విదేశీ ప్రభుత్వాలు భారత దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకునే విషయాన్ని లేవనెత్తవచ్చు. భారతదేశంలో అవినీతికి పాల్పడినందుకు అమెరికన్ కంపెనీలపై భారతీయ న్యాయస్థానాలు ఇదే విధంగా అభియోగాలు మోపవచ్చని బీజేపీ చెబుతోంది.
4) ఆరోపణల సమయం: నవంబర్ 25 నుంచి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాలకు ముందే అదానీపై ఆరోపణలు వచ్చాయి. అయితే, ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు రాజకీయ ప్రేరేపిత వ్యూహాంలో భాగమని బీజేపీ ఈ అభియోగాలను ఖండిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడి బాధ్యతలు తీసుకునే సమయం కూడా ఇక్క చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
-
Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్లో హై-వోల్టేజ్ డ్రామా..
-
America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
-
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!