Akash Deep: సిడ్నీ టెస్టు నుండి టీమిండియా ఫాస్ట్ బౌలర్ అవుట్..
- చివరి టెస్టుకు భారత ఫాస్ట్ బౌలర్
- ఆకాశ్ దీప్ అవుట్..
- హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశంలో వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akash Deep: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టుకు భారత ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ దూరమయ్యాడు. వెన్ను సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆకాశ్ దీప్, సిడ్నీ టెస్టుకు అందుబాటులో ఉండడని భారత హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ సిరీస్లో 1-2తో వెనుకబడి ఉన్న టీమిండియాకు ఆకాశ్ దీప్ గైర్హాజరీ ఓ ఎదురుదెబ్బగా మారనుంది. గత రెండు టెస్టుల్లో ఆకాశ్ దీప్ ఐదు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. అయితే, ఫీల్డింగ్లో కొన్ని కీలకమైన క్యాచ్లు జారవిడవడం టీమిండియాకు ఇబ్బందిగా మారింది. బ్రిస్బేన్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రాతో కలిసి చివరి వికెట్ భాగస్వామ్యంలో జట్టును ఫాలో-ఆన్ గండం నుంచి బయట పడేసాడు.
Also Read: Game Changer : ‘గేమ్ ఛేంజర్’ టైటిల్ పై సెన్సార్ బోర్డు ఏమన్నదంటే ?
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
సిరీస్ను సమం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టు సిడ్నీ టెస్టుకు ప్లేయింగ్-11పై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వెన్ను నొప్పితో ఆకాశ్ దీప్ దూరమైన కారణంగా హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణలో ఎవరో ఒకరికి తుది జట్టులో అవకాశం లభించే అవకాశం ఉంది. ఆకాశ్ దీప్ గైర్హాజరీతో భారత బౌలింగ్ విభాగంపై భారం మరింతగా పెరగనుంది. ఆస్ట్రేలియా మైదానాలు ఫాస్ట్ బౌలర్లకు సవాళ్లు విసురుతాయి. బౌలింగ్లో అధిక ఒత్తిడి కారణంగా మోకాలు, చీలమండలు, వెన్ను సంబంధిత సమస్యలు ఉత్పన్నం కావడం సాధారణం. సిడ్నీ పిచ్ పరిస్థితులను గమనించిన తర్వాత మాత్రమే తుది జట్టు ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని హెడ్కోచ్ గంభీర్ పేర్కొన్నారు.
టీమిండియా చివరి టెస్టు కోసం విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. సిడ్నీ టెస్టులో విజయం సాధించి సిరీస్ను సమం చేయడం కోసం టీమిండియా గెలుపు తప్పనిసరిగా మారింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!