Modi-Putin: నేడు మోడీ-పుతిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- భారత్లో కొనసాగుతున్న పుతిన్ పర్యటన
- నేడు మోడీ-పుతిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక విందులో పాల్గొననున్న పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన భారత్లో కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోడీ స్వయంగా వెళ్లి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఒకే కారులో ప్రయాణం చేశారు.
ఇది కూడా చదవండి: Putin: అమెరికా ఇంధనాన్ని కొనుగోలు చేయొచ్చు, ఇండియా చేస్తే తప్పా.?
Also Read
ఇక శుక్రవారం 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇక ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్లో పుతిన్కు అధికారిక స్వాగతం లభించనుంది. అనంతరం హైదరాబాద్ హౌస్లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఇక రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించనున్నారు. శిఖరాగ్ర సమావేశం తర్వాత రష్యా ప్రభుత్వ ఛానల్ను భారత్లో పుతిన్ ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించనున్నారు. తిరిగి రాత్రి 9 గంటలకు రష్యాకు బయల్దేరి వెళ్లిపోతారు.ఇదిలా ఉంటే గురువారం ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్నాథ్సింగ్, ఆండ్రీ బెలోసోవ్ పలు అంశాలపై చర్చించారు. ఎస్-400 రక్షణ వ్యవస్థలపై కీలక చర్చలు జరిపారు. సుఖోయ్-57 యుద్ధ విమానాలను విక్రయించేందుకు రష్యా సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: Akhanda 2: ‘అఖండ–2’ ప్రీమియర్ షోలు రద్దు… బాలయ్య ఫ్యాన్స్ రచ్చ
ఒప్పందాలు ఇవే..
ఇక ఈ రోజు జరిగే ద్వైపాక్షిక సంబంధాల్లో 2 బిలియన్ డాలర్ల జలాంతర్గాముల లీజు ఒప్పందంపై కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ముడి చమురు దిగుమతులపై కూడా చర్చకు వచ్చే ఛాన్సుంది. అలాగే రష్యాలో భారతీయ కార్మికులకు ఉద్యోగావకాశాలపై ఒప్పందం జరగనుంది. అలాగే భారత్ నుంచి రష్యాకు ఫార్మా, వ్యవసాయ, ఆహార, వినియోగ వస్తువుల ఎగుమతులపై ఒప్పందం జరిగే అవకాశం ఉంది.
- Tags
- Bilateral talks
- india
- modi
- Putin
- Russia
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!