Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
- బీహార్ ప్రభుత్వం యూటర్న్
- లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత
- Z కేటగిరీ భద్రతలో ఏముంటుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల తగ్గించిన భద్రతను తిరిగి పునరుద్ధరిస్తూ, ఇద్దరికీ మళ్లీ Z కేటగిరీ భద్రత కల్పించింది. అంతేకాకుండా, వారి ప్రయాణాల కోసం బుల్లెట్ప్రూఫ్ వాహనాన్ని కూడా అందజేసింది. బంగ్లా వివాదం నేపథ్యంలో లాలూ ప్రసాద్, రబ్రీ దేవి భద్రతను తగ్గించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఆ నిర్ణయానికి నిరసనగా వారు ప్రభుత్వం కల్పించిన భద్రతను తిరిగి అప్పగించారు. ఈ పరిణామాల అనంతరం తాజాగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని, వారి భద్రతను మళ్లీ పునరుద్ధరించింది.
Z కేటగిరీ భద్రతలో ఏముంటుంది?
Z కేటగిరీ భద్రత దేశంలో అత్యంత కీలక భద్రతా కేటగిరీలో ఒకటి. ఇందులో సాధారణంగా.. సుమారు 22 మంది భద్రతా సిబ్బంది, వారిలో 2 నుంచి 8 మంది సాయుధ కమాండోలు, నివాసం వద్ద నిరంతర భద్రత, 24 గంటల పాటు ఇద్దరు వ్యక్తిగత భద్రతా అధికారులు (PSOs), 3 నుంచి 5 వాహనాల కాన్వాయ్, ఒక బుల్లెట్ప్రూఫ్ వాహనం వంటి భద్రతా ఏర్పాట్లు ఉంటాయి.
Also Read
- Centre Orders Google, Apple: ప్రయాణికుల భద్రతకు ముప్పు.. గూగుల్, యాపిల్కు కేంద్రం కీలక ఆదేశాలు
- Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వంపై కుట్ర కేసులో షాకింగ్ నిజాలు.. రూ.180 కోట్లతో స్కెచ్..!
- Badrinath Temple: రామ మందిరం తర్వాత బద్రీనాథ్లోనూ దొంగలు..? విరాళాల కాజేత.. విచారణకు ఆదేశం
బంగ్లా వివాదం తర్వాత భద్రత తగ్గింపు
మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవికి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసు జారీ అయిన తర్వాత, బీహార్ ప్రభుత్వం లాలూ కుటుంబానికి కల్పిస్తున్న భద్రతను సమీక్షించింది. అనంతరం లాలూ ప్రసాద్, రబ్రీ దేవి, తేజ్ ప్రతాప్ యాదవ్ల భద్రతను తగ్గించాలని నిర్ణయించింది. అయితే, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, రాజ్యసభ సభ్యురాలు మీసా భారతి భద్రతలో ఎలాంటి మార్పులు చేయలేదు.
భద్రతను తిరిగి ఇచ్చేసిన లాలూ కుటుంబం
ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లాలూ ప్రసాద్, రబ్రీ దేవి తమకు కల్పించిన భద్రతను తిరిగి అప్పగించారు. అనంతరం తేజస్వి యాదవ్, మీసా భారతి కూడా తమ భద్రతను స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేశారు. ఈ అంశం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీయడంతో, చివరకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది.
రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న నిర్ణయం
లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ భద్రత కల్పించడం బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బంగ్లా వివాదం తర్వాత మొదలైన ఈ పరిణామాలు ఇప్పుడు భద్రత పునరుద్ధరణతో కొత్త మలుపు తిరిగాయి.
తాజావార్తలు
-
Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
-
Centre Orders Google, Apple: ప్రయాణికుల భద్రతకు ముప్పు.. గూగుల్, యాపిల్కు కేంద్రం కీలక ఆదేశాలు
-
Janhvi Kapoor: ఒక్క ఇన్స్టా పోస్ట్కే అన్ని లక్షలా!… జాన్వీ డిజిటల్ ఆదాయం షాకింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Renault Kwid Facelift: రెనాల్ట్ క్విడ్ ఫేస్లిఫ్ట్ విడుదల.. 17 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు, రూ.4.52 లక్షలకే..!
ట్రెండింగ్
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!