Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
- బీహార్ ప్రభుత్వం యూటర్న్
- లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత
- Z కేటగిరీ భద్రతలో ఏముంటుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల తగ్గించిన భద్రతను తిరిగి పునరుద్ధరిస్తూ, ఇద్దరికీ మళ్లీ Z కేటగిరీ భద్రత కల్పించింది. అంతేకాకుండా, వారి ప్రయాణాల కోసం బుల్లెట్ప్రూఫ్ వాహనాన్ని కూడా అందజేసింది. బంగ్లా వివాదం నేపథ్యంలో లాలూ ప్రసాద్, రబ్రీ దేవి భద్రతను తగ్గించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఆ నిర్ణయానికి నిరసనగా వారు ప్రభుత్వం కల్పించిన భద్రతను తిరిగి అప్పగించారు. ఈ పరిణామాల అనంతరం తాజాగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని, వారి భద్రతను మళ్లీ పునరుద్ధరించింది.
Z కేటగిరీ భద్రతలో ఏముంటుంది?
Z కేటగిరీ భద్రత దేశంలో అత్యంత కీలక భద్రతా కేటగిరీలో ఒకటి. ఇందులో సాధారణంగా.. సుమారు 22 మంది భద్రతా సిబ్బంది, వారిలో 2 నుంచి 8 మంది సాయుధ కమాండోలు, నివాసం వద్ద నిరంతర భద్రత, 24 గంటల పాటు ఇద్దరు వ్యక్తిగత భద్రతా అధికారులు (PSOs), 3 నుంచి 5 వాహనాల కాన్వాయ్, ఒక బుల్లెట్ప్రూఫ్ వాహనం వంటి భద్రతా ఏర్పాట్లు ఉంటాయి.
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
బంగ్లా వివాదం తర్వాత భద్రత తగ్గింపు
మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవికి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసు జారీ అయిన తర్వాత, బీహార్ ప్రభుత్వం లాలూ కుటుంబానికి కల్పిస్తున్న భద్రతను సమీక్షించింది. అనంతరం లాలూ ప్రసాద్, రబ్రీ దేవి, తేజ్ ప్రతాప్ యాదవ్ల భద్రతను తగ్గించాలని నిర్ణయించింది. అయితే, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, రాజ్యసభ సభ్యురాలు మీసా భారతి భద్రతలో ఎలాంటి మార్పులు చేయలేదు.
భద్రతను తిరిగి ఇచ్చేసిన లాలూ కుటుంబం
ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లాలూ ప్రసాద్, రబ్రీ దేవి తమకు కల్పించిన భద్రతను తిరిగి అప్పగించారు. అనంతరం తేజస్వి యాదవ్, మీసా భారతి కూడా తమ భద్రతను స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేశారు. ఈ అంశం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీయడంతో, చివరకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది.
రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న నిర్ణయం
లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ భద్రత కల్పించడం బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బంగ్లా వివాదం తర్వాత మొదలైన ఈ పరిణామాలు ఇప్పుడు భద్రత పునరుద్ధరణతో కొత్త మలుపు తిరిగాయి.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!