Presidential Election: రాష్ట్రపతి రేసులో నితీష్..! క్లారిటీ ఇచ్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ సాగుతోంది.. ఓవైపు ఎన్డీఏ తరఫున అభ్యర్థిని నిలిపేందుకు భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తుండగా… విపక్షాలు సైతం ఒకే అభ్యర్థిని పోటీకి పెట్టాలన్న ప్లాన్లో ముందుకు సాగుతున్నాయి.. అందులో భాగంగా రేపు ఢిల్లీ వేదికగా పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో కీలక భేటీ జరగబోతోంది. మరోవైపు.. ఎన్డీఏ అభ్యర్థి నితీష్ కుమారే అంటూ ప్రచారం సాగుతోంది.. బీహార్ సీఎంను.. ఎన్డీఏ తమ రాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలోకి దింపనుంది అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.. దీనిపై స్పందించిన నితీష్ కుమార్.. క్లారిటీ ఇచ్చేశారు.
Read Also: Presidential poll: దీదీ సమావేశానికి కేసీఆర్ దూరం.. కారణం అదేనా..?
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
రాష్ట్రపతి రేసులో నేను లేను అంటూ స్పష్టం చేశారు నితీష్ కుమార్.. నేనెక్కడికీ వెళ్లడంలేదు.. అలా వస్తున్న వార్తలన్నీ నిరాధారం, ఊహాగానాలు మాత్రమే అంటూ కొట్టిపారేశారు బీహార్ ముఖ్యమంత్రి.. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత మంత్రి శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను నితీష్ కుమార్ తోసిపుచ్చారు.. కాగా, రాష్ట్రపతి కావడానికి కావాల్సిన అన్ని సామర్థ్యాలూ నితీష్ కుమార్కు ఉన్నాయి.. ఓ బిహారీగా నితీష్ దేశ ప్రథమ పౌరుడు కావాలని తాను కోరుకుంటాను.. ఆయన రేసులో లేనప్పటికీ ప్రతి వ్యక్తి.. నితీష్ కుమార్ రాష్ట్రపతి కావాలనుకుంటారంటూ బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్ వ్యాఖ్యానించి.. చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే.
మరోవైపు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా.. హిస్టరీపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు నితీష్ కుమార్.. నేటి తరం కోసం గత చరిత్ర వైభవాన్ని తిరగరాయాలంటూ అమిత్షా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నితీష్.. చరిత్రను మార్చి రాయడం ఎలా సాధ్యమవుతుందంటూ మండిపడ్డారు.. అసలు చరిత్రను ఎవరైనా ఎలా మారుస్తారు? అని నిలదీశారు. పాండ్యులు, చోళుల చరిత్ర గురించి రాయాలని కేంద్ర హోం మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలపై ఏమనుకుంటున్నారని ఎదురైన ప్రశ్నికు స్పందించిన నితీష్ కుమార్.. అసలు చరిత్ర అంటే ఏమిటి? దాన్నెలా మారుస్తారు? అని మండిపడ్డారు. గత చరిత్రను ఎవరూ మార్చలేరు.. అదెలా సాధ్యం.. నాకైతే అర్థం కావట్లేదు.. చరిత్ర అంటే చరిత్రే. దానిలో మార్పులుండబోవని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!