Presidential Election: రాష్ట్రపతి రేసులో నితీష్..! క్లారిటీ ఇచ్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ సాగుతోంది.. ఓవైపు ఎన్డీఏ తరఫున అభ్యర్థిని నిలిపేందుకు భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తుండగా… విపక్షాలు సైతం ఒకే అభ్యర్థిని పోటీకి పెట్టాలన్న ప్లాన్లో ముందుకు సాగుతున్నాయి.. అందులో భాగంగా రేపు ఢిల్లీ వేదికగా పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో కీలక భేటీ జరగబోతోంది. మరోవైపు.. ఎన్డీఏ అభ్యర్థి నితీష్ కుమారే అంటూ ప్రచారం సాగుతోంది.. బీహార్ సీఎంను.. ఎన్డీఏ తమ రాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలోకి దింపనుంది అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.. దీనిపై స్పందించిన నితీష్ కుమార్.. క్లారిటీ ఇచ్చేశారు.
Read Also: Presidential poll: దీదీ సమావేశానికి కేసీఆర్ దూరం.. కారణం అదేనా..?
Also Read
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
రాష్ట్రపతి రేసులో నేను లేను అంటూ స్పష్టం చేశారు నితీష్ కుమార్.. నేనెక్కడికీ వెళ్లడంలేదు.. అలా వస్తున్న వార్తలన్నీ నిరాధారం, ఊహాగానాలు మాత్రమే అంటూ కొట్టిపారేశారు బీహార్ ముఖ్యమంత్రి.. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత మంత్రి శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను నితీష్ కుమార్ తోసిపుచ్చారు.. కాగా, రాష్ట్రపతి కావడానికి కావాల్సిన అన్ని సామర్థ్యాలూ నితీష్ కుమార్కు ఉన్నాయి.. ఓ బిహారీగా నితీష్ దేశ ప్రథమ పౌరుడు కావాలని తాను కోరుకుంటాను.. ఆయన రేసులో లేనప్పటికీ ప్రతి వ్యక్తి.. నితీష్ కుమార్ రాష్ట్రపతి కావాలనుకుంటారంటూ బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్ వ్యాఖ్యానించి.. చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే.
మరోవైపు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా.. హిస్టరీపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు నితీష్ కుమార్.. నేటి తరం కోసం గత చరిత్ర వైభవాన్ని తిరగరాయాలంటూ అమిత్షా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నితీష్.. చరిత్రను మార్చి రాయడం ఎలా సాధ్యమవుతుందంటూ మండిపడ్డారు.. అసలు చరిత్రను ఎవరైనా ఎలా మారుస్తారు? అని నిలదీశారు. పాండ్యులు, చోళుల చరిత్ర గురించి రాయాలని కేంద్ర హోం మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలపై ఏమనుకుంటున్నారని ఎదురైన ప్రశ్నికు స్పందించిన నితీష్ కుమార్.. అసలు చరిత్ర అంటే ఏమిటి? దాన్నెలా మారుస్తారు? అని మండిపడ్డారు. గత చరిత్రను ఎవరూ మార్చలేరు.. అదెలా సాధ్యం.. నాకైతే అర్థం కావట్లేదు.. చరిత్ర అంటే చరిత్రే. దానిలో మార్పులుండబోవని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!