Chhattisgarh: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 40 మంది మావోయిస్టుల హతం..
- ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్..
- 36 మంది మావోయిస్టుల మృతి..
- ఈ ఏడాది ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Breaking: ఛత్తీస్గఢ్ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. రాష్ట్రంలోని నారాయణపూర్-దంతెవాడ సరిహద్దుల్లోని మాడ్ ఏరియాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దాదాపుగా 40 మంది మావోయిస్టులు హతమయ్యారు. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆటోమేటిక్ గన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్తో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు భద్రతా బలగాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. అయితే, ఎన్ కౌంటర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేస్తూ.. ఇప్పటి వరకు 40 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు వెల్లడించారు..
Read Also: Nirmala Sitharaman: రానున్న ఐదేళ్లలో సామాన్యుల జీవితాల్లో మార్పులు తీసుకొస్తాం
Also Read
- INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
ఇటీవల కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించిన దాఖలాలు లేవు. జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) మరియు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) నిన్న మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇరు వర్గాల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఇప్పటికీ కాల్పులు జరుగుతూనే ఉన్నట్లు సమచారం. ఏక్-47 రైఫిళ్లతో సహా అటాల్ట్ రైఫిళ్లు, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా ఓర్చా, బర్సూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని గోవెల్, నెందుర్, తుల్తుడి గ్రామాల్లో జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. అటవీ ప్రాంతంలోకి పారిపోయిన మావోల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద విజయాల్లో ఇది ఒకటని అక్కడి అధికారులు అభివర్ణిస్తున్నారు.
ఛత్తీస్గఢ్కి చెందిన ఇద్దరు యువ ఐపీఎస్ అధికారులు ప్రభాత్ కుమార్, గౌరవ్ రాయ్ నాయకత్వంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలను సీఎం విష్ణుదేవ్ అభినందించార. సైనికుల ధైర్యాన్ని కొనియాడారు. ఈ ఏడాది కాంకేర్ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్ దాని కన్నా పెద్దది. 2024లో ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రల్లో కలిపి 200 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. ప్రతీ ఎన్కౌంటర్లో ఆరు నుంచి 10 మంది మావోలు హతమవుతున్నారు.
తాజావార్తలు
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!