ప్రయాణికులపై బెంగళూరు మెట్రో ఛార్జీల బాదుడు వేసింది. ఫిబ్రవరి 8న ఒకేసారి భారీగా ఛార్జీలు పెంచేసింది. గరిష్ట ఛార్జీ రూ. 60 నుంచి రూ.90కి పెంచేసింది. స్మార్ట్ కార్డ్ వినియోగదారుకు మాత్రం 5 శాతం తగ్గింపు లభిస్తుందని అధికారులు తెలిపారు. పెంచిన కొత్త ఛార్జీలు ఆదివారం (ఫిబ్రవరి 9) నుంచి అమల్లోకి రానున్నాయి. తక్కువ దూరాలకు (0-2 కి.మీ) ఛార్జీని రూ.10 ఉంచారు. 30 కి.మీ దాటిన ప్రయాణాలకు గరిష్ట ఛార్జీని ఇప్పుడు రూ.60 నుంచి రూ.90గా నిర్ణయించారు.