Abhishek Banerjee: దయచేసి చెడుగా మాట్లాడొద్దు.. టీఎంసీ నేతల్ని కోరిన మమతా మేనల్లుడు..
- దయచేసి జాగ్రత్తగా మాట్లాడండి..
- టీఎంసీ నేతలని కోరిన మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ..
- డాక్టర్ హత్యాచారం ఘటనపై టీఎంసీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Banerjee: కోల్కతాలో వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా హత్యాచారం జరిగింది. ఈ కేసుని సరిగా డీల్ చేయడంలో బెంగాల్ ప్రభుత్వం, పోలీసులు విఫలమైనట్లు కలకత్తా హైకోర్టు చీవాట్లు పెట్టింది. కేసుని సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా అరెస్ట్ చేశారు.
Read Also: Heavy Rain: వాతావరణ శాఖ మరో హెచ్చరిక.. మరో మూడు రోజుల్లో మరో ముప్పు..
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
ఇదిలా ఉంటే, ఈ ఘటన అధికార తృణమూల్ కాంగ్రెస్ సర్కార్, సీఎం మమతా బెనర్జీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్ర ప్రజలతో పాటు దేశం మొత్తం మమతా బెనర్జీపై దుమ్మెత్తిపోస్తోంది. ఇక సీఎం మమతా బెనర్జీతో పాటు ఆ పార్టీ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల మమతా మాట్లాడుతూ.. బెంగాల్ తగలబెడితే ఢిల్లీ, ఒడిశా, బీహార్, అస్సాం, యూపీ తగలబడేలా చేస్తానని ప్రధాని మోడీని హెచ్చరించారు. ఇక ఆ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్, టీఎంసీ కౌన్సిలర్ భర్త అయిన అతిష్ సర్కార్ వ్యాఖ్యలు మరింత వివాదంగా మారాయి. ‘‘మేము మీ ఇళ్లలోకి దూరి మీ తల్లులు, అక్కాచెల్లెళ్ల అసభ్యకరమైన ఫోటోలు తీసి, గోడలకు వేలాడదీస్తాం’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అతడిని పార్టీ ఒక ఏడాది పాటు సస్పెండ్ చేసింది.
డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తన పార్టీ నేతలకు కీలక సూచలను చేశారు. “పార్టీ శ్రేణులకు అతీతంగా ప్రజా ప్రతినిధులు మరింత వినయంగా మరియు సానుభూతితో మెలగాలి. వైద్య సిబ్బంది లేదా సివిల్ సొసైటీకి చెందిన ఎవరి గురించి చెడుగా మాట్లాడవద్దని ప్రతి ఒక్కరినీ నేను కోరుతున్నాను, ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంది. ఇది పశ్చిమ బెంగాల్ను ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి వేరు చేస్తుంది,” అని ట్వీట్ చేశారు. ఒక్క అతిష్ సర్కార్ మాత్రమే కాదు, టీఎంసీకి చెందిన మంత్రి ఉదయన్ గుహా, ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్, ఎమ్మెల్యే కంచన్ ముల్లిక్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
తాజావార్తలు
-
OTR: తెలంగాణ CMOలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ అసలు వ్యూహమేంటి?
-
OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
-
Vijay Deverakonda: మొన్న క్రికెట్ ఇప్పుడు వాలీ బాల్
-
OTR: డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎమ్మెల్యే పార్ధసారధి ప్రయత్నాలు.. ఎందుకు రివర్స్ అవుతున్నాయి?
-
Interest Rates: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ వడ్డీ రేట్లు..
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!