Abhishek Banerjee: దయచేసి చెడుగా మాట్లాడొద్దు.. టీఎంసీ నేతల్ని కోరిన మమతా మేనల్లుడు..
- దయచేసి జాగ్రత్తగా మాట్లాడండి..
- టీఎంసీ నేతలని కోరిన మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ..
- డాక్టర్ హత్యాచారం ఘటనపై టీఎంసీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Banerjee: కోల్కతాలో వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా హత్యాచారం జరిగింది. ఈ కేసుని సరిగా డీల్ చేయడంలో బెంగాల్ ప్రభుత్వం, పోలీసులు విఫలమైనట్లు కలకత్తా హైకోర్టు చీవాట్లు పెట్టింది. కేసుని సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా అరెస్ట్ చేశారు.
Read Also: Heavy Rain: వాతావరణ శాఖ మరో హెచ్చరిక.. మరో మూడు రోజుల్లో మరో ముప్పు..
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
- అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
ఇదిలా ఉంటే, ఈ ఘటన అధికార తృణమూల్ కాంగ్రెస్ సర్కార్, సీఎం మమతా బెనర్జీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్ర ప్రజలతో పాటు దేశం మొత్తం మమతా బెనర్జీపై దుమ్మెత్తిపోస్తోంది. ఇక సీఎం మమతా బెనర్జీతో పాటు ఆ పార్టీ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల మమతా మాట్లాడుతూ.. బెంగాల్ తగలబెడితే ఢిల్లీ, ఒడిశా, బీహార్, అస్సాం, యూపీ తగలబడేలా చేస్తానని ప్రధాని మోడీని హెచ్చరించారు. ఇక ఆ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్, టీఎంసీ కౌన్సిలర్ భర్త అయిన అతిష్ సర్కార్ వ్యాఖ్యలు మరింత వివాదంగా మారాయి. ‘‘మేము మీ ఇళ్లలోకి దూరి మీ తల్లులు, అక్కాచెల్లెళ్ల అసభ్యకరమైన ఫోటోలు తీసి, గోడలకు వేలాడదీస్తాం’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అతడిని పార్టీ ఒక ఏడాది పాటు సస్పెండ్ చేసింది.
డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తన పార్టీ నేతలకు కీలక సూచలను చేశారు. “పార్టీ శ్రేణులకు అతీతంగా ప్రజా ప్రతినిధులు మరింత వినయంగా మరియు సానుభూతితో మెలగాలి. వైద్య సిబ్బంది లేదా సివిల్ సొసైటీకి చెందిన ఎవరి గురించి చెడుగా మాట్లాడవద్దని ప్రతి ఒక్కరినీ నేను కోరుతున్నాను, ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంది. ఇది పశ్చిమ బెంగాల్ను ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి వేరు చేస్తుంది,” అని ట్వీట్ చేశారు. ఒక్క అతిష్ సర్కార్ మాత్రమే కాదు, టీఎంసీకి చెందిన మంత్రి ఉదయన్ గుహా, ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్, ఎమ్మెల్యే కంచన్ ముల్లిక్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!