Ashwini Vaishnaw: కాంగ్రెస్ హయాంతో ఎక్కువ రైలు ప్రమాదాలు.. గణాంకాలతో సహా ప్రతిపక్షాలపై కేంద్రమంత్రి ఫైర్..
- బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ రైలు ప్రమాదాలు..
- ‘‘రీల్ మంత్రి’’ విమర్శలపై ప్రతిపక్షాలపై అశ్విని వైష్ణవ్ ఆగ్రహం..
- కాంగ్రెస్ ఒక్కసారి మీ రికార్డులు చూసుకోవాలన్న రైల్వే మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwini Vaishnaw: ‘‘రీల్ మినిస్టర్’’ అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు మీ రికార్డులు చూసుకోవాలని కాంగ్రెస్తో పాటు ఇతన ప్రతిపక్షాలకు హితవు పలికారు. కాంగ్రెస్ హయాంతో పోలిస్తే బీజేపీ ప్రభుత్వ హయాంలో రైలు ప్రమాదాలు 68 శాతం తగ్గినట్లు చెప్పారు. గురువారం లోక్సభలో తన ప్రసంగంలో గణాంకాల ద్వారా ప్రతిపక్షాలను తూర్పారపట్టారు. కాంగ్రెస్ హయాంలో భద్రతా చర్యల్ని విస్మరించారని, ప్రతిపక్షాలు ఇప్పుడు ఈ సమస్యని రాజకీయం చేయాలని కోరుకుంటున్నారని విమర్శించారు.
Read Also: Man Kills Wife: అక్రమ సంబంధం అనుమానం.. 19 ఏళ్ల భార్య సజీవ దహనం..
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
58 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో 1 కి.మీ కూడా అటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్(ఏటీపీ)ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని ప్రశ్నించారు. జూలై 07న లోకోపైలట్ల వద్దకు వెళ్లిన రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. ఆయన లోకోమోటివ్ డ్రైవర్లతో రీల్స్ చేయడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. మంత్రి ప్రసంగిస్తుండగా రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ ఎంపీ హనుమాన్ బేనివాల్..‘‘మీరు రీలు మంత్రి, పట్టాలు తప్పిన మంత్రి’’ అనడంతో ఒక్కసారిగా వైష్ణవ్ కోపంతో ‘‘నువ్వు నోరు మూసుకో’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం రీల్స్ చేసేవాళ్లం కాదని, కష్టపడి పనిచేసేవాళ్లమని చెప్పారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో వార్షిక సగటు ప్రమాదాల సంఖ్య 171 కాగా, ప్రధాని మోడీ హయాంలో 68 శాతం తగ్గిందని చెప్పారు. మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ప్రమాదాల సంఖ్యని 0.24 నుంచి 0.19కి తగ్గిస్తామని చెప్పినప్పుడు ఇదే ప్రతిపక్షాలు చప్పట్లు కొట్టారని, ఇప్పుడు ఇది 0.19 నుంచి 0.03కి తగ్గినప్పుడు ఎలా నిందలు వేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సోషల్ మీడియాలో వారి ట్రోల్ ఆర్మీ సాయంతో తప్పుడు వాదనల్ని లేవనెత్తుతోందని, ప్రతీరోజూ రైళ్లలో ప్రయాణించే 2 కోట్ల మందిని భయపెట్టాలని చూస్తున్నారా..? అని అడిగారు.
తాజావార్తలు
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
-
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
-
Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!