Ashwini Vaishnaw: కాంగ్రెస్ హయాంతో ఎక్కువ రైలు ప్రమాదాలు.. గణాంకాలతో సహా ప్రతిపక్షాలపై కేంద్రమంత్రి ఫైర్..
- బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ రైలు ప్రమాదాలు..
- ‘‘రీల్ మంత్రి’’ విమర్శలపై ప్రతిపక్షాలపై అశ్విని వైష్ణవ్ ఆగ్రహం..
- కాంగ్రెస్ ఒక్కసారి మీ రికార్డులు చూసుకోవాలన్న రైల్వే మంత్రి..
Ashwini Vaishnaw: ‘‘రీల్ మినిస్టర్’’ అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు మీ రికార్డులు చూసుకోవాలని కాంగ్రెస్తో పాటు ఇతన ప్రతిపక్షాలకు హితవు పలికారు. కాంగ్రెస్ హయాంతో పోలిస్తే బీజేపీ ప్రభుత్వ హయాంలో రైలు ప్రమాదాలు 68 శాతం తగ్గినట్లు చెప్పారు. గురువారం లోక్సభలో తన ప్రసంగంలో గణాంకాల ద్వారా ప్రతిపక్షాలను తూర్పారపట్టారు. కాంగ్రెస్ హయాంలో భద్రతా చర్యల్ని విస్మరించారని, ప్రతిపక్షాలు ఇప్పుడు ఈ సమస్యని రాజకీయం చేయాలని కోరుకుంటున్నారని విమర్శించారు.
Read Also: Man Kills Wife: అక్రమ సంబంధం అనుమానం.. 19 ఏళ్ల భార్య సజీవ దహనం..
Also Read
- West Bengal: బీజేపీ విజయం తర్వాత తెరుచుకున్న దుర్గా ఆలయం.. భక్తుల్లో ఆనందోత్సాహం
- Congress Comeback: ఐదు రాష్ట్రాల పోరులో అతిపెద్ద లబ్ధిదారు కాంగ్రెస్సే ! బీజేపీకి మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇదే..
- One Vote Victory: ఒక్క ఓటుతో గెలుపు.. తిరుపత్తూరులో టీవీకే అభ్యర్థి సంచలన విజయం!
- Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
58 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో 1 కి.మీ కూడా అటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్(ఏటీపీ)ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని ప్రశ్నించారు. జూలై 07న లోకోపైలట్ల వద్దకు వెళ్లిన రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. ఆయన లోకోమోటివ్ డ్రైవర్లతో రీల్స్ చేయడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. మంత్రి ప్రసంగిస్తుండగా రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ ఎంపీ హనుమాన్ బేనివాల్..‘‘మీరు రీలు మంత్రి, పట్టాలు తప్పిన మంత్రి’’ అనడంతో ఒక్కసారిగా వైష్ణవ్ కోపంతో ‘‘నువ్వు నోరు మూసుకో’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం రీల్స్ చేసేవాళ్లం కాదని, కష్టపడి పనిచేసేవాళ్లమని చెప్పారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో వార్షిక సగటు ప్రమాదాల సంఖ్య 171 కాగా, ప్రధాని మోడీ హయాంలో 68 శాతం తగ్గిందని చెప్పారు. మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ప్రమాదాల సంఖ్యని 0.24 నుంచి 0.19కి తగ్గిస్తామని చెప్పినప్పుడు ఇదే ప్రతిపక్షాలు చప్పట్లు కొట్టారని, ఇప్పుడు ఇది 0.19 నుంచి 0.03కి తగ్గినప్పుడు ఎలా నిందలు వేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సోషల్ మీడియాలో వారి ట్రోల్ ఆర్మీ సాయంతో తప్పుడు వాదనల్ని లేవనెత్తుతోందని, ప్రతీరోజూ రైళ్లలో ప్రయాణించే 2 కోట్ల మందిని భయపెట్టాలని చూస్తున్నారా..? అని అడిగారు.
తాజావార్తలు
-
West Bengal: బీజేపీ విజయం తర్వాత తెరుచుకున్న దుర్గా ఆలయం.. భక్తుల్లో ఆనందోత్సాహం
-
TVK : టీవీకే విజయకేతనం.. విజయ్ వెనుక అసలైన ‘చాణక్యుడు’ ఇతడే
-
Stock Market Crash: గల్ఫ్ ‘టెన్షన్’.. మార్కెట్ ‘డిప్రెషన్’.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. 500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్!
-
Walking 10,000 Steps Daily: రోజుకు 10,000 అడుగులు నడవడం నిజంగా అవసరమా..? మోకాళ్లపై ప్రభావం ఏమిటి?
-
Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!