Asaduddin Owaisi: టిప్పు సుల్తాన్ చరిత్రను తుడిచేయలేరు.. కండోమ్లు ఎక్కువగా ఎవరు వాడుతున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi comments on Tippu Express name change: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి బీజేపీపై ఫైర్ అయ్యారు. ‘టిప్పు ఎక్స్ప్రెస్’ పేరును ‘వడయార్ ఎక్స్ప్రెస్’గా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రైల్వే మంత్రిత్వ శాఖ బెంగళూర్ నుంచి మైసూర్ వెళ్లే ట్రైన్ టిప్పు ఎక్స్ప్రెస్ పేరును వడయార్ ఎక్స్ప్రెస్ గా మార్చింది. బీజేపీ యజమానులు అయిన బ్రిటీష్ వారికి ఎదురొడ్డి పోరాడినందుకు వారికి కోపం తెప్పించిందని అందుకు రైలు పేరు మార్చారని దుయ్యబట్టారు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా టిప్పు సుల్తాన్ మూడు యుద్ధాలు చేశాడనే కోపం కాషాయ పార్టీలో ఉందని ఎద్దేవా చేశారు. టిప్పు సుల్తాన్ వారసత్వాన్ని బీజేపీ ఎప్పటికీ తుడిచివేయలేదని అన్నారు. టిప్పు బతికుండగా బ్రిటీష్ వారిని భయపెట్టారు. ఇప్పుడు బ్రిటిష్ బానిసలను భయపెట్టారని బీజేపీపై విమర్శలు గుప్పించారు.
Also Read
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా ఈ ఏడాది జూలైలో టిప్పు ఎక్స్ప్రెస్ పేరును మార్చాలని రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరారు. దీనికి స్పందించిన రైల్వే శాఖ రైలు పేరు మార్చింది. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ ట్విట్ చేస్తూ.. శుక్రవారానికి శుభవార్త.. ఇప్పుడు టిప్పు ఎక్స్ప్రెస్ బదులుగా వడయార్ ఎక్స్ప్రెస్ మీకు సేవలు అందిస్తుందని.. అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి ప్రయత్నాలకు ధన్యవాదాలు తెలియజేశారు. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కూడా స్పందించారు. కేంద్ర రైల్వే శాఖ చర్యలను ప్రశంసించారు. ఇది కర్ణాటక రాష్ట్ర సంపన్నమైన వారసత్వం, అద్భుతమైన చరిత్రకు గుర్తింపు అని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో వడయార్ రాజవంశ చేసిన కృషిని గుర్తిస్తూ రైలు పేరును మార్చారు.
BJP govt renamed Tippu Express to Wodeyar Express. Tipu irks BJP because he waged 3 wars against its British masters. Another train could have been named after Wodeyars. BJP will never be able to erase Tipu’s legacy. He scared British while alive & scares British slaves even now pic.twitter.com/vsFJi5fR1D
— Asaduddin Owaisi (@asadowaisi) October 9, 2022
ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కూడా అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ముస్లిం జనాభా పెరగడం లేదని.. పడిపోతుందని.. కండోమ్ ఎక్కువగా వాడుతున్నది ఎవరు..? మనమే అని వ్యాఖ్యానించారు. మోహన్ భగవత్ దీనిపై మాట్లాడరని అన్నారు. దేశంలో ఎక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నా.. ముస్లింలు బహిరంగ జైలులో బతుకుతున్నట్లు అనిపిస్తోందని.. ముస్లిం కన్నా రోడ్డు పక్కన కుక్కకే ఎక్కవ గౌరవం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
-
UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
-
Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
-
Narendra Modi: ‘జవహర్ లాల్ నెహ్రూ’ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
-
Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి