Arvind Kejriwal: కుటుంబంతో సీఎం కేజ్రీవాల్ అయోధ్య యాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ రేపు అయోధ్య వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా ఆయన రామ మందిరాన్ని సందర్శించనున్నారు. అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఆయన భార్య, తల్లిదండ్రులు అయోధ్య రాముడిని దర్శించుకోనున్నారు. కేజ్రీవాల్తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా అయోధ్య యాత్రకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
అయోధ్యలో జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని గతంలో కేజ్రీవాల్ చెప్పారు. తాను కుటుంబ సమేతంగా అయోధ్య వెళ్లాలనుకుంటున్నట్లు ఆ సమయంలో చెప్పారు. రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత దేశవ్యాప్తంగా లక్షలాది మంది అయోధ్యకు తరలివస్తున్నారు.
Also Read
ఇదిలా ఉంటే, ఈ రోజు యూపీ సీఎం యోగి నేతృత్వంలో ఎమ్మెల్యేలు అయోధ్య రాముడి దర్శనానికి వెళ్లారు. అయితే, ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష అఖిలేష్ యాదవ్ ఎస్పీ పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ, ఓపీ రాజ్భర్ నేతృత్వంలోని ఎస్బీఎస్పీ, జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు బస్సుల్లో అయోధ్య చేరుకున్నారు. మైనారిటీ బుజ్జగింపుల్లో సమాజ్వాదీ పార్టీ ఉందని యూపీ డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మైర్య, బ్రజేష్ పాఠక్ విమర్శించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!