Tower Semiconductor: భారత్లో ఇజ్రాయిల్ “సెమీకండక్టర్” కంపెనీ ప్లాంట్.. 8 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ప్రణాళిక..
Tower Semiconductor: భారతదేశం సెమీకండక్టర్ తయారీ పరిశ్రమల్లో పురోగమించాలనే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యానికి అనుగుణంగా పలు దిగ్గజ సెమీకండక్టర్ కంపెనీలు ఇండియాలో తన ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే యూఎస్ చిప్ మేకర్ మైక్రాన్ టెక్నాలజీ గుజరాత్లో అసెంబ్లీ, టెస్ట్ ఫెసిలిటీని స్థాపించడానికి 825 మిలియన్ల పెట్టుబడిని ప్రకటించింది. ఫేజ్-1, ఫేజ్-2లుగా ఈ సంస్థ ప్లాంట్ సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మైక్రాన్ తన తొలి చిప్ విడుదల చేస్తుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Also Read
- Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి 'ఫస్ట్'కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
- Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
- Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
- Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
ఇదిలా ఉంటే, తాజాగా ఇజ్రాయిల్ దిగ్గజ “టవర్ సెమికండక్టర్” కంపెనీ భారత్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. భారత ప్రభుత్వం నుంచి ప్రోత్సహకాలను కోరుతూ, ఈ కంపెనీ తన ప్రణాళికను సమర్పించింది. భారతదేశంలో 65 నానోమీటర్స్, 40 నానోమీటర్ చిప్లను తయారు చేయాలని చూస్తోంది. దీని కోసం 8 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రణాళికను రచించింది. సెమీకండర్ల తయారీకి సంబంధించి ప్రధాని మోడీ ప్రభుత్వం డిసెంబర్ 2021న 10 బిలియన్ డాలర్లతో పథకాన్ని రూపొందించింది. ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గతేడాది అక్టోబర్ నెలలో టవర్ సెమీకండక్టర్ సీఈఓ రస్సెల్ సీ ఎల్వాంగర్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్లో ఇజ్రాయిల్ రాయబారి నౌర్ గిలోన్ కూడా పాల్గొన్నారు.
టవర్ సెమీకండక్టర్ ఇజ్రాయిల్ చిప్ మేకర్. హై వాల్యూ అనలాగ్ సెమీకండక్టర్ సొల్యూషన్లో పేరొందిన సంస్థ. ఆటోమోటివ్, మెడికల్, ఇండస్ట్రియల్, కన్స్యూమర్, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ప్రపంచవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ మంది వినియోగదారుల కోసం అనలాగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను తయారు చేస్తున్న కంపెనీగా గుర్తింపు ఉంది.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!