Tower Semiconductor: భారత్లో ఇజ్రాయిల్ “సెమీకండక్టర్” కంపెనీ ప్లాంట్.. 8 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ప్రణాళిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tower Semiconductor: భారతదేశం సెమీకండక్టర్ తయారీ పరిశ్రమల్లో పురోగమించాలనే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యానికి అనుగుణంగా పలు దిగ్గజ సెమీకండక్టర్ కంపెనీలు ఇండియాలో తన ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే యూఎస్ చిప్ మేకర్ మైక్రాన్ టెక్నాలజీ గుజరాత్లో అసెంబ్లీ, టెస్ట్ ఫెసిలిటీని స్థాపించడానికి 825 మిలియన్ల పెట్టుబడిని ప్రకటించింది. ఫేజ్-1, ఫేజ్-2లుగా ఈ సంస్థ ప్లాంట్ సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మైక్రాన్ తన తొలి చిప్ విడుదల చేస్తుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Also Read
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
- Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
- Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
ఇదిలా ఉంటే, తాజాగా ఇజ్రాయిల్ దిగ్గజ “టవర్ సెమికండక్టర్” కంపెనీ భారత్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. భారత ప్రభుత్వం నుంచి ప్రోత్సహకాలను కోరుతూ, ఈ కంపెనీ తన ప్రణాళికను సమర్పించింది. భారతదేశంలో 65 నానోమీటర్స్, 40 నానోమీటర్ చిప్లను తయారు చేయాలని చూస్తోంది. దీని కోసం 8 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రణాళికను రచించింది. సెమీకండర్ల తయారీకి సంబంధించి ప్రధాని మోడీ ప్రభుత్వం డిసెంబర్ 2021న 10 బిలియన్ డాలర్లతో పథకాన్ని రూపొందించింది. ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గతేడాది అక్టోబర్ నెలలో టవర్ సెమీకండక్టర్ సీఈఓ రస్సెల్ సీ ఎల్వాంగర్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్లో ఇజ్రాయిల్ రాయబారి నౌర్ గిలోన్ కూడా పాల్గొన్నారు.
టవర్ సెమీకండక్టర్ ఇజ్రాయిల్ చిప్ మేకర్. హై వాల్యూ అనలాగ్ సెమీకండక్టర్ సొల్యూషన్లో పేరొందిన సంస్థ. ఆటోమోటివ్, మెడికల్, ఇండస్ట్రియల్, కన్స్యూమర్, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ప్రపంచవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ మంది వినియోగదారుల కోసం అనలాగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను తయారు చేస్తున్న కంపెనీగా గుర్తింపు ఉంది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!