Kejriwal: బీజేపీని గెలిపించేందుకే కాంగ్రెస్ పోటీ చేస్తోంది.. కేజ్రీవాల్ ఆరోపణలు
- బీజేపీని గెలిపించేందుకే కాంగ్రెస్ పోటీ చేస్తోంది
- ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆప్.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారి ఢీకొంటున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్.. కాంగ్రెస్ టార్గెట్గా తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీని గెలిపించేందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోందని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Live-in relation: కుళ్లిపోయిన స్థితిలో తండ్రి, కూతురు మృతదేహాలు.. “లివ్-ఇన్ పార్ట్నర్” అరెస్ట్..
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
- Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
కాంగ్రెస్ మద్దతుదారులను ఉద్దేశించి కేజ్రీవాల్ వీడియో సందేశంలో హస్తం పార్టీపై ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చినా.. ఆ పార్టీ నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు. అంటే బీజేపీని గెలిపించేందుకే కాంగ్రెస్ నేతలు పని చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మద్దతుదారులతో ఒకటే చెప్పానని.. ‘‘కాంగ్రెస్కు ఓటు వేస్తే.. బీజేపీ అధికారంలోకి వస్తుంది. అదే జరిగితే పాఠశాలలు నాశనమవుతాయి. ఉచిత కరెంట్, నీళ్లు, మొహల్లా క్లినిక్లు, మహిళలకు ఉచిత బస్సు ఇలా అన్నీ ఆగిపోతాయి. ఒక కుటుంబం నెలకు రూ.25 వేలు నష్టపోవాల్సి వస్తుందని చెప్పాను. వాళ్లంతా ఏకీభవించారు. చీపురు గుర్తుకే ఓటు వేస్తామని చెప్పారు’’ అని కేజ్రీవాల్ వీడియోలో వివరించారు.
ఇది కూడా చదవండి: Electric Vehicles: పెట్రోల్ – డీజిల్ కంటే ఎలక్ట్రిక్ వాహనాలతో అధిక కాలుష్యం!
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!