Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Around 39 Percent Of Indian Families Have Experienced Online Financial Fraud Survey

Online Financial Fraud: భారతీయ కుటుంబాల్లో 39 శాతం ఆన్‌లైన్ ఆర్థిక మోసాల బాధితులే.. ఈ తరహా మోసాలే అధికం..

Published Date :May 2, 2023 , 5:18 pm
By Venu Goapl Reddy
Online Financial Fraud: భారతీయ కుటుంబాల్లో 39 శాతం ఆన్‌లైన్ ఆర్థిక మోసాల బాధితులే.. ఈ తరహా మోసాలే అధికం..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Online Financial Fraud: భారతదేశంలో ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీలు పెరిగాయి. ఇందుకు తగ్గట్లుగానే ఆన్‌లైన్ ఆర్థిక మోసాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదిలా ఉంటే ఆన్‌లైన్ మోసాలపై లోకల్ సర్కిల్స్ తాజాగా ఓ సర్వే నివేదికను వెల్లడించింది. ఇండియాలో దాదాపుగా 39 శాతం కుటుంబాలు ఆన్‌లైన్ ఆర్థిక మోసాల్ని అనుభవించినట్లు సర్వే వెల్లడించింది. దాదాపు 23 శాతం మంది వినియోగదారులు క్రెడిట్ కార్డ్ మోసాన్ని అనుభవించినట్లు తెలిపారు. 10 శాతం మంది ఏటీఎం కార్డు గురైనట్లు, మరో 10 శాతం బ్యాంక్ అకౌంట్ మోసానికి గురైనట్లు తెలిపారు. మొత్తంగా 39 శాతం భారతీయ కుటుంబాలు గత మూడేళ్లలో ఆర్థిక మోసాలను ఎదుర్కొన్నామని, వారిలో 24 శాతం మంది మాత్రమే తమ డబ్బులను తిరిగి పొందినట్లు లోకల్ సర్కిల్స్ మంగళవారం ఓ నివేదికలో పేర్కొంది.

ఈ సర్వేలో 23 శాతం మంది క్రెడిట్, డెబిట్ కార్డ్ మోసాలను అనుభవించినట్లు తెలుపగా, దీంట్లో 13 శాతం మంది ఆన్ లైన్ సైట్లలో అమ్మడం, కొనుగోలు చేయడం వంటివాటితో మోసపోయినట్లు వెల్లడించారు. 10 శాతం మంది ఏటీఎం కార్డ్ మోసాల గురించి తెలిపారు. సర్వేలో పాల్గొన్న 30 శాతం మంది ఆర్థిక మోసాలకు గురైన కుటుంబాల్లో ఒక సభ్యుడిగా ఉన్నానని వెల్లడించారు. మరో 9 శాతం మంది తమ కుటుంబాల్లో చాలా మంది గత మూడేళ్లలో ఆర్థిక మోసాలకు గురైనట్లు తెలిపారు. 57 శాతం మంది ఈ ఆన్ లైన్ మోసాలను నుంచి తమ కుటుంబాలు తప్పించుకున్నందకు సంతోషం వ్యక్తం చేయగా.. 4 శాతం మంది వారి స్పందనను క్లీయర్ గా తెలియజేయలేదు.

Also Read

  • New Bat Coronavirus: థాయ్‌లాండ్‌లో కొత్త కరోనావైరస్.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?
  • Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ భవిష్యత్తును తేల్చనున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు.!
  • Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు
  • DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
Add as a preferred
source on google

Read Also: Boora Narsaiah Goud: బీజేపీ అధికారంలో ఉండుంటే.. తెలంగాణ మరో లెవెల్‌లో ఉండేది

భారతదేశంలో 331 జిల్లాల్లో ఉన్న కుటుంబాల నుంచి 66 శాతం మంది పురుషులు, 34 శాతం మంది మహిళలు టోటల్ గా ఈ సర్వేకు దాదాపుగా 32,000 మంది పాల్గొన్నట్లు సర్వే సంస్థ వెల్లడించింది. ఇందులో 39 శాతం మంది టైర్ 1 సిటీల నుంచి 35 శాతం మంది టైర్ 2 సిటీల నుంచి 26 శాతం మంది టైర్ 3,4 సిటీలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారుగా వెల్లడించింది. కేవలం 24 శాతం అంటే 11,305 మంది తాము మోసపోయిన డబ్బును పొందినట్లు తెలిపారు. 70 శాతం మంది తమ ఫిర్యాదుకు ఎలాంటి పరిష్కారం లభించలేదని చెప్పారు.

ఆర్థిక మోసాలకు నష్టపోయే కుటుంబాల శాతం 2022 తో పోలిస్తే 2023లో స్వల్పంగా తగ్గింది. గత ఏడాది క్రెడిట్, డెబిట్ కార్డ్ మోసాలు మోసాలు 18 శాతం ఉంటే ప్రస్తుతం 23 శాతానికి చేరాయి. ఇక్కడ హ్యాపీ న్యూస్ ఏంటంటే ఆర్థిక మోసాలకు గురైన కుటుంబాలు తిరిగి తమ డబ్బులను పొందే శాతం 2022లో 17 శాతం ఉంటే 2023లో 24 శాతానికి పెరిగింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ATM card fraud
  • credit or debit card fraud
  • LocalCircles
  • Online Financial Fraud

తాజావార్తలు

  • Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం

  • LED Smart TV: స్మార్ట్ టీవీలపై బంపర్ డీల్స్.. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ. 5499కే..

  • Parenting Tips : పిల్లల పెంపకంలో మీరు ఈ మాటలు వాడుతున్నారా.? అయితే జాగ్రత్త..!

  • Lavanya Tripathi: చిరంజీవిపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • OnePlus Nord CE 6 Lite: వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర సేల్ డేట్ పూర్తి సమాచారం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions