PM Modi: శివాజీ విగ్రహం కూలడంపై ప్రజలకు క్షమాపణలు చెప్పిన మోడీ
- మహారాష్ట్రలో ప్రధాని మోడీ పర్యటన
- శివాజీ విగ్రహం కూలడంపై ప్రజలకు మోడీ క్షమాపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పాల్ఘర్లో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ ప్రజలకు క్షమాపణ చెప్పారు. రాజ్కోట్ కోటలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంతో మీ మనసులు గాయపడ్డాయని తనకు తెలుసన్నారు. గాయపడిన హృదయాలకు క్షమాపణ చెబుతున్నట్లు మోడీ పేర్కొన్నారు. మహారాష్ట్రలో దిగగానే మొట్టమొదట విగ్రహం కూలినందుకు శివాజీకి క్షమాపణ చెప్పానని.. మనసులు గాయపడినందుకు ఇప్పుడు ప్రజలకు కూడా క్షమాపణ చెబుతున్నట్లు ప్రధాని తెలిపారు.
ఇది కూడా చదవండి: Pilli Subhash Chandra Bose: రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్తోనే ఉంటాను..
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
‘ఛత్రపతి శివాజీ మహారాజ్ను తాము దైవంగా భావిస్తాం. తీవ్రంగా గాయపడిన వారికి నేను శిరస్సు వంచి వారికి క్షమాపణలు చెబుతున్నాను. మన విలువలు వేరు. మనకు మన దైవం కంటే పెద్దది ఏమీ లేదు.’ అని ప్రధాని అన్నారు.
గతేడాది డిసెంబర్లో నేవీ డే వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఇది సడన్గా కూలిపోయింది. దీంతో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) కూటమి విగ్రహ నిర్మాణం విషయంలో అధికార ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
ఇది కూడా చదవండి: Himanta Biswa Sarma: అసెంబ్లీలో 2 గంటల నమాజ్ బ్రేక్ రద్దు.. అస్సాం సీఎం సంచలన నిర్ణయం..
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడుతున్నాయి. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి.. అధికారంలోకి రావాలని ఇండియా కూటమి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఎక్కువ సీట్లు సాధించడంతో ఆశలు పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: New Zealand: న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్ కీలక నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ తర్వాత..!
#WATCH | Palghar, Maharashtra: PM Narendra Modi speaks on the Chhatrapati Shivaji Maharaj's statue collapse incident in Malvan
He says, "…Chhatrapati Shivaji Maharaj is not just a name for us… today I bow my head and apologise to my god Chhatrapati Shivaji Maharaj. Our… pic.twitter.com/JhyamXj91h
— ANI (@ANI) August 30, 2024
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!