Himanta Biswa Sarma: అసెంబ్లీలో 2 గంటల నమాజ్ బ్రేక్ రద్దు.. అస్సాం సీఎం సంచలన నిర్ణయం..
- సంచలన నిర్ణయం తీసుకున్న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ..
- అసెంబ్లీలో నమాజ్ విరామం రద్దు..
- శాసన వ్యవహారాల ఉత్పాదకత పెంచాలనే ఈ నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: యూనిఫాం సివిల్ కోడ్ అమలులో భాగంగా అస్సాంలోని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం కీలక బిల్లుకు గురువారం ఆమోదం తెలిపింది. ముస్లిం వివాహాలు-విడాకులను ప్రభుత్వం దగ్గర తప్పనిసరిగా నమోదు చేయాలనే బిల్లుని తీసుకువచ్చింది. ఈ బిల్లు కాజీ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు బహుభార్యత్వం, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయనుంది. కాంగ్రెస్ వంటి విపక్షాలు ఈ బిల్లుని విమర్శిస్తున్నప్పటికీ ఇది బాలికల అభ్యున్నతికి కీలక బిల్లు అని అస్సాం ప్రభుత్వం చెబుతోంది.
ఇదిలా ఉంటే, తాజాగా సీఎం హిమంత బిస్వ శర్మ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతీ శుక్రవారం రెండు గంటల పాటు నమాజ్ విరామాన్ని రద్దు చేస్తున్నట్లు ఈ రోజు సభలో ప్రకటించారు. ఇది ప్రొడక్టివిటీని పెంచడంతో పాటు వలస కాలం నాటి పద్ధతుల్ని తొలగించేందుకు ఒక అడుగుగా పేర్కొన్నారు. ముస్లిం చట్టసభ సభ్యులు, ఇతర సిబ్బంది శుక్రవారం ప్రార్థనలు లేదా నమాజ్ కోసం విరామం తీసుకోవడానికి అనుమతించే దీర్ఘకాలిక నిబంధనల్ని తొలగిస్తుంది.
Also Read
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
Read Also: Abortion: గర్భం దాల్చిన 12 వారాల వరకు అబార్షన్ మాత్రలు సురక్షితం.. లాన్సెట్ స్టడీ..
ఈ చారిత్రాత్మక నిర్ణయానికి మద్దతు ఇచ్చినందుకు అసెంబ్లీ స్పీకర్ బిస్వజిత్ డైమరీ, ఇతర శాసన సభ్యులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. జుమ్మా విరామాన్ని రద్దు చేయడం ద్వారా, అస్సాం అసెంబ్లీ పాతది అని తాను భావించే పద్ధతుల కంటే శాసనసభ ఉత్పాదకతకు ప్రాధాన్యత ఇస్తోందని ఆయన నొక్కి చెప్పారు. ఎలాంటి మతాలకు తావు లేకుండా సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్పారు.
అస్సాం శాసనసభలో నమాజ్ విరామాన్ని రద్దు చేయడం అసెంబ్లీ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం, శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఉండే విరామాన్ని రద్దు చేశారు. ఈ నిర్ణయం అసెంబ్లీ షెడ్యూల్లో గణనీయమైన మార్పుల్ని సూచిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా ఇప్పుడు శుక్రవారాలతో సహా ప్రతీ రోజూ ఉదయం 3.90 గంటలకు సభ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
-
Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!