RSS: భారత వ్యతిరేక శక్తులు “సుప్రీంకోర్టు”ను ఓ సాధనంగా ఉపయోగించుకుంటున్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BBC Documentary On Modi: భారత వ్యతిరేఖ శక్తులు సుప్రీంకోర్టును ఓ సాధనంగా వినియోగించుకుంటున్నాయని తన అనుబంధ పత్రిక పాంచజన్యలో పేర్కొంది. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో బీబీసీ ప్రధాని నరేంద్రమోదీపై రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం బ్లాక్ చేసింది. భారత్ కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్న బీబీసీని బ్యాన్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. అయితే దీన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దీనిపై ఆర్ఎస్ఎస్ తాజాగా తన పత్రికలో వ్యాఖ్యలు చేసింది.
సుప్రీంకోర్టు ఈ పిటిషన్ కొట్టివేతపై పాంచజన్య సంపాదకీయంగా ప్రస్తావించింది. సుప్రీంకోర్టు దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి సృష్టించబడిందని.. దీనిని భారత వ్యతిరేక శక్తులు ఓ ‘టూల్’గా ఉపయోగించుకుంటున్నాయని విమర్శించింది. పర్యావరణం పేరుతో దేశ ఎదుగుదలకు అడ్డంకులు సృష్టిస్తూ, మానవ హక్కుల పేరుతో ఉగ్రవాదులను రక్షించే ప్రయత్నం చేసిన తర్వాత, ఇప్పుడు భారత్ను వ్యతిరేకించే శక్తులకు భారత్లోనే వ్యతిరేకంగా ప్రచారం చేసే హక్కు ఉండాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.
Also Read
- Suryastra Rocket: శత్రువులకు హెచ్చరికగా.. స్వదేశీ ‘సూర్యాస్త్ర’ రాకెట్ సక్సెస్.. పెరిగిన డిఫెన్స్ పవర్
- PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ
- Chandrayaan-3: చంద్రయాన్-3 సంచలన ఆవిష్కరణ.. చంద్రుడిపై బయటపడిన కొత్త నిజం
- AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
Read Also: 2023 Tata Harrier: టాటా హారియర్ 2023 బుకింగ్స్ ఓపెన్.. ధర, ఫీచర్స్ వివరాలివే..
పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో సుప్రీంకోర్టు నడుస్తోందని.. భారత చట్టాల ప్రకారం దేశ ప్రయోజనాల కోసం పని చేస్తుందని సంపాదకీయంలో తెలిపింది. భారత వ్యతిరేక శక్తులు మనకు వ్యతిరేకంగా మన ప్రజాస్వామ్యం, మన దాతృత్వం, మన నాగరికత ప్రమాణాలను ఉపయోగించుకుంటున్నాయని తెలిపింది.
2002 గోద్రా అనంతరం అల్లర్ల నేపథ్యంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ హయాంలోని ప్రభుత్వం పాత్ర ఉందని బీబీసీ డాక్యుమెంటరీ ‘‘ ఇండియా- దిమోదీ క్వశ్చన్’’లొ ఆరోపించింది. దీనిపై ఇటు ఇండియాలో అటు యూకేలో పెద్ద ఎత్తున రగడ ఏర్పడింది. భారత ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీని ‘ వలసవాద మనస్తత్వం’గా ఆరోపించింది. డాక్యుమెంటరీని అడ్డుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మరోొ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఏప్రిల్ లో విచారణ జరపనుంది.
తాజావార్తలు
-
He-Man: ‘హీ-మ్యాన్’గా యంగ్ హీరో నిఖిల్.. దద్దరిల్లుతున్న ట్రైలర్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సెలబ్రేషన్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదే.. అందరినీ ఏడిపించేశాడుగా..
-
Suryastra Rocket: శత్రువులకు హెచ్చరికగా.. స్వదేశీ ‘సూర్యాస్త్ర’ రాకెట్ సక్సెస్.. పెరిగిన డిఫెన్స్ పవర్
-
Mega 158: డాడీ కోసం పెద్ది!
-
PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!