Amit Shah: “ఆ పోస్టులు ఖాళీగా లేవు”.. కాంగ్రెస్, ఆర్జేడీపై అమిత్ షా కామెంట్స్..
- ప్రధాని, సీఎం పోస్టులు ఖాళీ లేవు..
- లాలూ, సోనియాలకు అవకాశం లేదు..
- బీహార్ ఎన్నికల ర్యాలీలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు వ్యాఖ్యల పదును పెరిగింది. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నిస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏన్డీయే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ అని స్పష్టం చేశారు. ‘‘బీహార్లో సీఎం పోస్టు, ఢిల్లీలో పీఎం పోస్టు ఖాళీగా లేవు. నితీష్ కుమార్ ఇక్కడ, మోడీ అక్కడ ఉన్నారు’’ అని బీహార్లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా అన్నారు. లాలూ, సోనియా గాంధీలకు అవకాశం లభించదని చెప్పారు. జింగిల్ రాజ్ నుంచి బీహార్ను రక్షించుకోవడానికి ఈ ఎన్నికలు చాలా కీలమని, ఒక్క తప్పు చేసినా రాష్ట్రం 20 ఏళ్ల వెనక్కి వెళ్తుందని అమిత్ షా ప్రజల్ని హెచ్చరించారు.
Read Also: DK Shivakumar: “కారు” లేని అబ్బాయిలకు అమ్మాయిలను ఇవ్వడం లేదు.. బీజేపీ రెస్పాన్స్ ఇదే..
Also Read
- Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
- Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
- Centre Orders Google, Apple: ప్రయాణికుల భద్రతకు ముప్పు.. గూగుల్, యాపిల్కు కేంద్రం కీలక ఆదేశాలు
- Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
‘‘బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి చాలా మంది యువకులకు టిక్కెట్లు ఇచ్చింది, కానీ ఆర్జేడీ మరియు కాంగ్రెస్ టిక్కెట్లు ఇవ్వలేదు. లాలూ జీ తన కుమారుడు తేజస్వి (యాదవ్) ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారు. సోనియా జీ తన కుమారుడు రాహుల్ (గాంధీ) ను ప్రధానమంత్రిగా చేయాలని కోరుకుంటున్నారు. రెండు పదవులు ఖాళీగా లేవని నేను వారికి తెలియజేయాలనుకుంటున్నాను’’ అని దర్భాంగా ర్యాలీలో ఆయన అన్నారు.
‘‘పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ లో పీఎఫ్ఐ కార్యకర్తలు చురుగ్గా ఉన్నారు. దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించాం. వారిని జైలులో పెట్టాం. బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారు జైలులో ఉంటారని మీరు భావిస్తున్నారా..?’’ అని ప్రశ్నించారు. చొరబాటుదారుల పేర్లు ఓటర్ జాబితాలో ఉండాలని రాహుల్ గాంధీ అనుకుంటున్నారని విమర్శించారు.
ప్రచారంలో జాప్యం, సీట్ల పంపకాల చర్చలు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షేత్ర స్థాయిలో లేకపోవడంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల, మహాఘటబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ను ప్రకటించారు. దీంతో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించిన నేపథ్యంలో అమిత్ షా నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. 2005లో ఆర్జేడీని గద్దె దించిన నితీష్ కుమార్ అప్పటి నుంచి సీఎంగా కొనసాగుతున్నారు.
తాజావార్తలు
-
Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
-
RBI: విదేశీ మారక, బంగారు నిల్వలు భారీ పతనం.. ఆర్బీఐ తాజా గణాంకాలు
-
Netflix: పరిచయాలు అవసరం లేదు.. మంచి కథ ఉంటే నెట్ఫ్లిక్స్లో గోల్డెన్ ఛాన్స్
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ మూవీ.. ఎవరూ ఊహించని హీరో?.. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!
-
Sriman: “నేను పక్కా తెలుగువాడిని.. కానీ ఇక్కడ నా పేరు రిజిస్టర్ కాలేదు”.. నటుడు ఆవేదన!
ట్రెండింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో