Amartya Sen: కాంగ్రెస్-ఆప్ ఐక్యత చాలా అవసరం, కలిసి పోరాడాల్సింది..
- ఆప్-కాంగ్రెస్ కలిసి పోరాడాల్సింది..
- ఢిల్లీ ఎన్నికలపై అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amartya Sen: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆప్ కలిసి పోరాడాల్సిందని ప్రముఖ నోబెల్ అవార్డ్ గ్రహీత, ఆర్థికవేత్త అమర్త్యసేన్ అన్నారు. పశ్చిమ బెంగాల్ బిర్భూమ్ జిల్లాలోని తన పూర్వీకులు ఇంట్లో ఆయన పీటీఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. భారతదేశం లౌకికవాదం మనుగడ సాగించాలంటే, ఐక్యత మాత్రమే కాకుండా, భారతదేశాన్ని బహుత్వానికి అద్భుతమైన ఉదాహరణగా మార్చిన విషయాలపై ఒప్పందం ఉండాలని అన్నారు. కాంగ్రెస్, ఆప్ మధ్య ఐక్యత అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.
Read Also: Anji Reddy Chinnamile : కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు కల్పించిన తర్వాత ఓట్లు అడగాలి….
Also Read
ఢిల్లీ ఎన్నికలకు చాలా ప్రాముఖ్యత ఉందని, ఆప్ గెలిచి ఉంటే, ఈ విజయం తన సొంత బలాన్ని కలిగి ఉండేదని అన్నారు. ఆప్ పరాజయం గురించి మాట్లాడుతూ.. ఢిల్లీలో హిందుత్వ ఆధారిత ప్రభుత్వం కోరుకోని వారిలో ఐక్యత లేకపోవడం కారణమని చెప్పారు. చాలా సీట్లలో ఆప్పై బీజేపీ ఆధిక్యం కన్నా కాంగ్రెస్కి లభించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. నిజానికి ఇండియా కూటమిలో ఆప్ ఓడిపోవాల్సిన అవసరం లేదు కానీ, ఓడిపోయిందని అన్నారు.
ఢిల్లీ ఎన్నికలు ఉత్తర ప్రదేశ్ ఎన్నికలపై పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని ఆయన అన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సమాజ్ వాదీ పార్టీ ఏం చేసిందో, హిందుత్వ రాజకీయలకు వ్యతిరేకంగా బలమైన వైఖరి తీసుకుందో అలాగే ఆప్ చేయాలని అమర్త్యసేన్ చెప్పారు. ఢిల్లీ ఎన్నికలు బెంగాల్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందా..? అనే ప్రశ్నకు సమాధానంగా.. భారతదేశంలో ప్రతీ ఎన్నిక ఇతర ఎన్నికలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. బెంగాల్లో టీఎంసీ, సీపీఎం, కాంగ్రెస్ వంటి లౌకిక పార్టీలు వేరేదారుల్లో వెళ్లినప్పటికీ, ఢిల్లీలో జరిగినట్లుగా ఇక్కడ జరిగే అవకాశం కనిపించడం లేదని అన్నారు.
తాజావార్తలు
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!