Congress: రాజస్థాన్ సంక్షోభంపై కాంగ్రెస్ కీలక సమావేశం.. గెహ్లాట్, పైలెట్ మధ్య సఖ్యత కుదిరేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అయితే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మాత్రం తారాస్థాయికి చేరుకుంది. సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ మధ్య విభేదాలు మాత్రం సమసిపోవడం లేదు. స్వపక్షంలోనే ఉంటూ విపక్షాల్లా విమర్శించుకుంటున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరి మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ రోజు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ని అధిష్టానం ఢిల్లీకి పిలిచింది. గెహ్లాట్ రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు.
ఈ ఇద్దరి మధ్య విభేదాలు రచ్చకెక్కడంతో అధిష్టానం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ధీ ఇటు గెహ్లాట్ వర్గం, అటు పైలెట్ వర్గం ఏ మాత్రం తగ్గడం లేదు. మూడేళ్ల క్రితం సచిన్ పైలెట్ చేసిన తిరుగుబాటు విఫలం అయింది. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య పడటం లేదు. అయితే ప్రస్తుతం గెహ్లాట్ ను పిలిచిన అధిష్టానం, త్వరలో పైలెట్ ను పిలిచి చర్చిస్తారని తెలుస్తోంది. కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య విభేదాలను పరిష్కరించి, ఇద్దరు కలిసి పనిచేసేలా చేసి కర్ణాటకలో భారీ విజయాన్ని సాధించింది కాంగ్రెస్. అదే ఫార్ములాను ఇక్కడ కూడా వర్తింపచేయాలని చూస్తున్నాడు.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
Read Also: Raghunandan Rao : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు లీగల్ నోటీసు.. రూ.1000కోట్లకు పరువునష్టం దావా
గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి పైలెట్ ఎక్కువగా కృషి చేశాడు. అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించారు. కానీ అధిష్టానం మాత్రం అశోక్ గెహ్లాట్ ను సీఎంగా చేసింది. అప్పటి నుంచి పైలెట్, అతని వర్గంలో అసంతృప్తి ఉంది. ప్రస్తుతం పైలెట్ బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీక్ స్కామ్ పై చర్యలు తీసుకోవాలని సీఎం గెహ్లాట్ ను డిమాండ్ చేస్తున్నాడు. ఈ నెలాఖరులోగా చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని అల్టిమెటం జారీ చేశారు. కాంగ్రెస్ తో సంబంధం లేకుండా జన్ సంఘర్ష్ యాత్ర చేపట్టారు పైలెట్.
2018 ఎన్నికల్లో మొత్తం 200 స్థానాల్లో కాంగ్రెస్ 100, బీజేపీ 73 స్థానాల్లో గెలిచింది. రాజస్థాన్లో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా 2 సార్లు గెలిచింది లేదు. ప్రతీ సారి రాజస్థాన్ ఓటర్లు ప్రభుత్వాన్ని మారుస్తుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. వరసగా రెండోసారి గెలుద్దాం అని అనుకుంటున్న కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!