Success Story: ఉద్యోగం పోవడమే వరంగా మారింది.. దీప్ సింగ్ చీమా సక్సెస్ స్టోరీ..
- ఉద్యోగం కోల్పోవడం వరమైంది
- పంజాబ్కు చెందిన మొహబ్బత్ దీప్ సింగ్ చీమా సక్సెస్ స్టోరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Success Story: కరోనా మహమ్మారి కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి వారిలో మొహబ్బత్ దీప్ సింగ్ చీమా కూడా ఒకరు. ఉద్యోగం పోవడంతో దీప్ సింగ్ చీమా(36) తన భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి తన సొంత రాష్ట్రం పంజాబ్కు తిరిగి వచ్చాడు. ధిల్వాన్లో తన సొంత ఫుడ్ ట్రక్ ‘ది పిజ్జా ఫ్యాక్టరీ’ని స్థాపించడానికి ఇదే మొదటి అడుగు అని కూడా అతనికి తెలియదు. తన ఉద్యోగాన్ని కోల్పోకపోతే మొహబ్బత్ దీప్ సింగ్ చీమా తన సొంత వ్యాపారం ప్రారంభించాలని ఎప్పుడూ ఆలోచించేవాడు కాదు. ఆ విధంగా ఉద్యోగం కోల్పోవడం అతనికి ఒక వరంగా మారింది. అది ఎలాగో తెలుసుకుందాం.
ఉద్యోగం పోయింది.. ఆలోచన పుట్టింది..
దీప్ సింగ్ చీమా పనిచేస్తున్నప్పుడు రూ.2.5 లక్షల జీతం వచ్చేది. ఆ ఆర్థిక భద్రతను హఠాత్తుగా కోల్పోవడంతో అతను ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కరోనా మహమ్మారి చాలా మంది ఉద్యోగాలను కొల్లగొట్టింది. 100 ఎకరాల భూమి ఉన్న ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన దీప్ సింగ్ చీమా వ్యవసాయం వైపు మొగ్గు చూపలేదు. మంచి పిజ్జా, బర్గర్లు అందించడానికి ధిల్వాన్లో ఎవరూ లేరని గ్రహించాడు.
Also Read
ఇక్కడ నుంచే దీప్ సింగ్ చీమాకు ఫుడ్ ట్రక్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. 4 లక్షల తొలి పెట్టుబడితో ‘ది పిజ్జా ఫ్యాక్టరీ’ని ప్రారంభించాడు. జనాలు ముందు అతడిని ఎగతాళి చేసేవారు. ప్రారంభంలో కొన్ని నెలలు తీవ్రంగా శ్రమించాడు. చాలా మంది సమోసాలు, పకోడీలు తినడానికి అలవాటు పడ్డారు. ప్రేక్షకులకు కొత్త ఆహారాన్ని పరిచయం చేయడం కష్టం. కానీ దీప్ సింగ్ చీమా మనసు మార్చుకోలేదు. ప్రజలను ఆకర్షించేందుకు తన మెనూ ధరను రూ.199గా ఉంచాడు. ఈ ధరలో ఎవరైనా ఎన్ని పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైస్ అయినా తినొచ్చు. స్కూల్కు వెళ్లే చిన్నతనంలో దీప్కి వంట చేయడం అంటే ఇష్టం, హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకున్నాడు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అతను మరో దారిని ఎంచుకోవలసి వచ్చింది.
ఇప్పుడు నెలకు రూ.2 లక్షలు
దీప్ కు వంట పట్ల ఉన్న మక్కువ ‘ది పిజ్జా ఫ్యాక్టరీ’తో మళ్లీ పుంజుకుంది. అతను తన వంట పరిజ్ఞానాన్ని చెఫ్ రణ్వీర్ బ్రార్ నుంచి నేర్చుకున్నాడు. ఈరోజు డీప్ ధిల్వాన్లో ఫుడ్ ట్రక్కులను తెరవడానికి చాలా మందిని ప్రేరేపించాడు. ఫుడ్ ట్రక్ వ్యాపారం గురించి సలహా పొందడానికి గోరఖ్పూర్ నుండి ప్రజలు అతని వద్దకు వచ్చేవారు. ధిల్వాన్ జంక్షన్ను ఇప్పుడు ‘పిజ్జా-బర్గర్ జంక్షన్’ అని పిలుస్తారు. ప్రస్తుతం దీప్ సింగ్ చీమా ప్రతి నెలా రూ.2 లక్షలు సంపాదిస్తున్నారు. ఎంతో మందికి అతను స్ఫూర్తిగా నిలిచాడు. ఉద్యోగం లేకపోయినా వ్యాపారం పెట్టుకుని జీవించవచ్చనే భరోసాను కల్పించాడు. అతని స్ఫూర్తితో చాలా మంది ఫుడ్ ట్రక్ బిజినెస్ చేస్తున్నారంటే అతిశయోక్తి లేదు.
తాజావార్తలు
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
-
Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!