African Swine Fever: మరో కొత్త వైరస్.. భారత్లో వెలుగుచూసిన ఆఫ్రికన్ స్వైన్ఫ్లూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో మబరో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది.. త్రిపురలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ (ఏఎస్ఎఫ్) వెలుగుచూసింది.. సెపాహిజాలా జిల్లా పరిధిలోని దేవిపూర్లో ఉన్న జంతు వనరుల అభివృద్ధి శాఖ (ఏఆర్డీడీ) నిర్వహిస్తున్న ఫారమ్లో ఈ తరహా కేసులు గుర్తించినట్టు తెలిపారు.. దీంతో, అప్రమత్తం అయిన అగర్తలలోని నిపుణుల బృందం… ఆ ఫారమ్ను సందర్శించి పరిస్థితిని అంచనా వేసేందుకు చర్యలు ప్రారంభించింది.. దీనికోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేసింది. అయితే, ఈ నెల 7వ తేదీన శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ఈశాన్య ప్రాంతీయ వ్యాధి నిర్ధారణ లాబోరేటరీకి పంపగా.. 13వ తేదీన వచ్చిన పీసీఆర్ ఫలితాల్లో పాజిటివ్గా నిర్ధారించారు. ఫారమ్లోని పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉండడంతో.. ఫ్లూ ఫారమ్ మొత్తం వ్యాపించి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ నిర్ధారణ అయిన తర్వాత పందులను సామూహికంగా ఉరితీయాలని ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలుస్తోంది.
Read Also: Astrology: ఏప్రిల్ 19, మంగళవారం దినఫలాలు
Also Read
- Rahul Gandhi-Om Birla: లోక్సభ స్పీకర్తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
ఇక, భోపాల్లోని నేషనల్ డిసీజ్ డయాగ్నస్టిక్ ఇన్స్టిట్యూట్ నుండి రావాల్సిన మరో నివేదిక ఇంకా రాలేదని పశుసంవర్థక శాఖ రన్ డిసీజ్ ఇన్వెస్టిగేషన్ లాబొరేటరీలోని సీనియర్ అధికారి వెల్లడించారు.. మేం ప్రతి గ్రూపులో పది మందితో కూడిన రెండు టాస్క్ఫోర్స్లను ఏర్పాటు చేశాం.. బృందాలకు వెటర్నరీ అధికారి నాయకత్వం వహిస్తారు.. వారు నేరుగా నోడల్ అధికారుల ప్యానెల్కు నివేదిస్తారని తెలిపారు. మొదటి పందులను సామూహికంగా చంపేయడం.. ఆ తర్వాత వైరస్ సోకిన పందులను పాతిపెట్టడానికి 8 అడుగుల మేర లోతైన గుంతలను తోవి అందులో పాతిపెట్టనున్నారు. దీనిపై అధికార ప్రకటనపై మీడియా ప్రశ్నించగా.. పరిశోధకులు భారత ప్రభుత్వానికి లేఖ రాస్తారు.. కేంద్రం ఈ విషయాన్ని ప్రధాన కార్యదర్శికి తెలియజేస్తుందని తెలిపారు. అధికారిక లేఖ రాష్ట్ర ప్రభుత్వానికి చేరిన తర్వాత మాత్రమే అన్ని తదుపరి ప్రక్రియలు నిర్వహించనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఇక, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 63 పందులు.. గుర్తు తెలియని కారణాలతో చనిపోయాయని.. ఆ పందుల షెడ్డులో 265 పందులు మరియు 185 పంది పిల్లలు ఉన్నాయని వెల్లడించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi-Om Birla: లోక్సభ స్పీకర్తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
ట్రెండింగ్
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?