Delhi Classroom Scam: సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియాలకు ఏసీబీ సమన్లు
- సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియాలకు ఏసీబీ సమన్లు
- ఢిల్లీ తరగతి గదుల కుంభకోణం కేసులో నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ తరగతి గదుల కుంభకోణం కేసులో మాజీమంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లకు ఏసీబీ సమన్లు జారీ చేసింది. రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. జూన్ 6న హాజరుకావాలని సత్యేంద్ర జైన్కు, జూన్ 9న హాజరుకావాలని మనీష్ సిసోడియాకు సమన్లలో ఏసీబీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Meghalaya: టూరిస్ట్ రాజాది హత్యగా తేల్చిన పోలీసులు.. భార్య సోనమ్ ఆచూకీ కోసం గాలింపు
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ఈ ప్రాజెక్ట్ను అప్పటి ఆప్ ప్రభుత్వం 34 మంది కాంట్రాక్టర్లకు అప్పగించింది. వీరిలో ఎక్కువ మంది ఆప్తో అనుబంధంగా ఉన్నవారే ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ ఖురానా, బీజేపీ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా, బీజేపీ మీడియా రిలేషన్స్ విభాగం నుంచి నీలకాంత్ బక్షి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఏసీబీ ఈ చర్య తీసుకుంది. సెమీ-పర్మనెంట్ తరగతి గదుల నిర్మాణంలో ఖర్చులు పెరగడం, అవకతవకలు జరిగాయని ఫిర్యాదులో ఆరోపించారు. రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: IPL 2025 Awards: ఐపీఎల్ విజేత ప్రైజ్మనీ ఎంతో తెలుసా.. అవార్డ్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు ఒక అంచనా. ప్రాజెక్ట్ చేపట్టాక తరగతి గది నిర్మాణం అమాంతంగా పెరిగిపోయింది. మార్కెట్ రేటు కంటే అదనంగా పెరిగిపోయినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రూ.2,892 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 12,748 తరగతి గదులను నిర్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టెండర్ల ప్రకారం ఒక్కో తరగతి గదికి రూ.24.86 లక్షలు ఖర్చయింది. ఇది అంచనా వేసిన మార్కెట్ రేటు రూ.5 లక్షల కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ అయినట్లుగా ఆరోపించింది. ఈ ప్రాజెక్టును 34 మంది కాంట్రాక్టర్లకు అప్పగించారని, వీరిలో ఎక్కువ మంది ఆప్తో ముడిపడి ఉన్నారని చౌహాన్ తెలిపారు.
2015-16 సమావేశాల్లో ఖర్చు ఫైనాన్స్ కమిటీ (EFC) ఈ ప్రాజెక్టును కఠినమైన షరతుతో ఆమోదించిందని ఏసీబీ చీఫ్ మధుర్ వర్మ మీడియాకు తెలిపారు. జూన్ 2016 నాటికి మంజూరు చేయబడిన ఖర్చులోనే దీనిని పూర్తి చేయాలని.. భవిష్యత్తులో ఎటువంటి పెరుగుదలకు అవకాశం లేదన్నారు. అయితే దర్యాప్తులో ఆర్థిక ప్రణాళిక ఉల్లంఘన జరిగినట్లు తెలిసిందన్నారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని.. ఆప్ నాయకులు త్వరలో హాజరుకానున్న తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!