Delhi Classroom Scam: సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియాలకు ఏసీబీ సమన్లు
- సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియాలకు ఏసీబీ సమన్లు
- ఢిల్లీ తరగతి గదుల కుంభకోణం కేసులో నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ తరగతి గదుల కుంభకోణం కేసులో మాజీమంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లకు ఏసీబీ సమన్లు జారీ చేసింది. రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. జూన్ 6న హాజరుకావాలని సత్యేంద్ర జైన్కు, జూన్ 9న హాజరుకావాలని మనీష్ సిసోడియాకు సమన్లలో ఏసీబీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Meghalaya: టూరిస్ట్ రాజాది హత్యగా తేల్చిన పోలీసులు.. భార్య సోనమ్ ఆచూకీ కోసం గాలింపు
Also Read
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
ఈ ప్రాజెక్ట్ను అప్పటి ఆప్ ప్రభుత్వం 34 మంది కాంట్రాక్టర్లకు అప్పగించింది. వీరిలో ఎక్కువ మంది ఆప్తో అనుబంధంగా ఉన్నవారే ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ ఖురానా, బీజేపీ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా, బీజేపీ మీడియా రిలేషన్స్ విభాగం నుంచి నీలకాంత్ బక్షి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఏసీబీ ఈ చర్య తీసుకుంది. సెమీ-పర్మనెంట్ తరగతి గదుల నిర్మాణంలో ఖర్చులు పెరగడం, అవకతవకలు జరిగాయని ఫిర్యాదులో ఆరోపించారు. రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: IPL 2025 Awards: ఐపీఎల్ విజేత ప్రైజ్మనీ ఎంతో తెలుసా.. అవార్డ్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు ఒక అంచనా. ప్రాజెక్ట్ చేపట్టాక తరగతి గది నిర్మాణం అమాంతంగా పెరిగిపోయింది. మార్కెట్ రేటు కంటే అదనంగా పెరిగిపోయినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రూ.2,892 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 12,748 తరగతి గదులను నిర్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టెండర్ల ప్రకారం ఒక్కో తరగతి గదికి రూ.24.86 లక్షలు ఖర్చయింది. ఇది అంచనా వేసిన మార్కెట్ రేటు రూ.5 లక్షల కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ అయినట్లుగా ఆరోపించింది. ఈ ప్రాజెక్టును 34 మంది కాంట్రాక్టర్లకు అప్పగించారని, వీరిలో ఎక్కువ మంది ఆప్తో ముడిపడి ఉన్నారని చౌహాన్ తెలిపారు.
2015-16 సమావేశాల్లో ఖర్చు ఫైనాన్స్ కమిటీ (EFC) ఈ ప్రాజెక్టును కఠినమైన షరతుతో ఆమోదించిందని ఏసీబీ చీఫ్ మధుర్ వర్మ మీడియాకు తెలిపారు. జూన్ 2016 నాటికి మంజూరు చేయబడిన ఖర్చులోనే దీనిని పూర్తి చేయాలని.. భవిష్యత్తులో ఎటువంటి పెరుగుదలకు అవకాశం లేదన్నారు. అయితే దర్యాప్తులో ఆర్థిక ప్రణాళిక ఉల్లంఘన జరిగినట్లు తెలిసిందన్నారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని.. ఆప్ నాయకులు త్వరలో హాజరుకానున్న తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!