PM Modi: “మూర్ఖులకు రాజు”.. రాహుల్ గాంధీ ‘మేడ్ ఇన్ చైనా’ వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్..
PM Modi: మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి ఈ రోజే చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించాయి. ప్రధాని నరంద్రమోడీ ఈ రోజు బీతుల్ జిల్లా బహిరంగ సమావేశంలో ప్రసంగించారు. భారీగా హాజరైన జనాలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. బీజేపీ విజయం ఖాయమైందని అన్నారు.
బుధవారం భగవాన్ బీర్సాముండా జయంతిని దేశం మొత్తం జరుపుకుంటున్న సందర్భంగా గిరిజనుల సంక్షేమం కోసం కేంద్రం రూ. 24,000 కోట్ల విలువైన పథకాన్ని ప్రారంభించనుందని నరేంద్రమోడీ మంగళవారం తెలిపారు. మధ్యప్రదేశ్ ప్రజల్లో భాజపా పట్ల అపూర్వమైన విశ్వాసం, ప్రేమానురాగాలు చూశామని, ఎన్నికల ముందు కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని ప్రధాని మోదీ అన్నారు. రేపు జనజాతీయ గౌరవ్ దివాస్, భగవాన్ బిర్సా ముండాకు నివాళులు అర్పించేందుకు రేపు జార్ఖండ్ వెళ్లనున్నట్లు, అక్కడే గిరిజనుల అభివృద్ధి కోసం కొత్త పథకాన్ని ప్రకటించనున్నట్లు ప్రధాని ప్రకటించారు.
Also Read
- Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
- Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
- Rajinikanth: రజినీకాంత్ ఓటు వేస్తుంటే ఈవీఎం వరకు కెమెరాలు.. రికార్డైన 'తలైవా' ఓటు..! అసలేం జరిగింది?
- Assembly Elections: తమిళనాడు, బెంగాల్లో పోటాపోటీగా పోలింగ్.. ఉ.11 గంటలకు భారీగా ఓటింగ్
మోదీ హమీల ముందు కాంగ్రెస్ బూటకపు హామీలు పనికి రావని ఆ పార్టీకి అర్థమైందని, నవంబర్ 17 దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ వాదనలు బట్టబయలవుతున్నాయని, కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని, ఇప్పుడు ఆ పార్టీ అదృష్టంపై ఆధారపడుతుందని ఎద్దేవా చేశారు.
Read Also: Israel-Hamas War: గాజాపై పట్టు సాధిస్తున్న ఇజ్రాయిల్.. హమాస్ పార్లమెంట్, ప్రభుత్వ భవనాలు స్వాధీనం..
జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా చట్టం, రామ మందిర నిర్మాణం నిజమవుతాయని కాంగ్రెస్ ఎప్పుడూ నమ్మలేదని, కానీ వాటిన్నింటిని చేసి చూపించామని మోడీ అన్నారు. ప్రపంచంలో మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ రెండో స్థానంలో ఉందని, అయితే ప్రజల జేబుల్లో ‘మేడ్ ఇన్ చైనా’ ఫోన్లు ఉన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్ లో మేడ్ ఇన్ చైనా ఫోన్లు ఉన్నాయని మహాజ్ఞాని నిన్న అన్నారు.. మూర్ఖుల రాజు ఏ ప్రపంచంలో జీవిస్తున్నారో, తమ దేశ ప్రగతిని చూడలేని రోగం వారికి ఉందని కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని విమర్శించారు. ప్రపంచంలో మొబైల్ ఫోన్ల తయారీలో భారతదేశం రెండో అతిపెద్ద దేశంగా అవతరించిందని ప్రధాని తెలిపారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇంట్లో కూర్చున్నారు, వారికి బయటకు వెళ్లాలని అనిపించడం లేదని ప్రధాని అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రవంలో కాంగ్రెస్ అవినీతి, దోపిడిని అరకట్టడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధాని అన్నారు.
తాజావార్తలు
-
Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..
-
Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
-
Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
-
Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
-
Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?