PM Modi: “మూర్ఖులకు రాజు”.. రాహుల్ గాంధీ ‘మేడ్ ఇన్ చైనా’ వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి ఈ రోజే చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించాయి. ప్రధాని నరంద్రమోడీ ఈ రోజు బీతుల్ జిల్లా బహిరంగ సమావేశంలో ప్రసంగించారు. భారీగా హాజరైన జనాలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. బీజేపీ విజయం ఖాయమైందని అన్నారు.
బుధవారం భగవాన్ బీర్సాముండా జయంతిని దేశం మొత్తం జరుపుకుంటున్న సందర్భంగా గిరిజనుల సంక్షేమం కోసం కేంద్రం రూ. 24,000 కోట్ల విలువైన పథకాన్ని ప్రారంభించనుందని నరేంద్రమోడీ మంగళవారం తెలిపారు. మధ్యప్రదేశ్ ప్రజల్లో భాజపా పట్ల అపూర్వమైన విశ్వాసం, ప్రేమానురాగాలు చూశామని, ఎన్నికల ముందు కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని ప్రధాని మోదీ అన్నారు. రేపు జనజాతీయ గౌరవ్ దివాస్, భగవాన్ బిర్సా ముండాకు నివాళులు అర్పించేందుకు రేపు జార్ఖండ్ వెళ్లనున్నట్లు, అక్కడే గిరిజనుల అభివృద్ధి కోసం కొత్త పథకాన్ని ప్రకటించనున్నట్లు ప్రధాని ప్రకటించారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
మోదీ హమీల ముందు కాంగ్రెస్ బూటకపు హామీలు పనికి రావని ఆ పార్టీకి అర్థమైందని, నవంబర్ 17 దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ వాదనలు బట్టబయలవుతున్నాయని, కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని, ఇప్పుడు ఆ పార్టీ అదృష్టంపై ఆధారపడుతుందని ఎద్దేవా చేశారు.
Read Also: Israel-Hamas War: గాజాపై పట్టు సాధిస్తున్న ఇజ్రాయిల్.. హమాస్ పార్లమెంట్, ప్రభుత్వ భవనాలు స్వాధీనం..
జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా చట్టం, రామ మందిర నిర్మాణం నిజమవుతాయని కాంగ్రెస్ ఎప్పుడూ నమ్మలేదని, కానీ వాటిన్నింటిని చేసి చూపించామని మోడీ అన్నారు. ప్రపంచంలో మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ రెండో స్థానంలో ఉందని, అయితే ప్రజల జేబుల్లో ‘మేడ్ ఇన్ చైనా’ ఫోన్లు ఉన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్ లో మేడ్ ఇన్ చైనా ఫోన్లు ఉన్నాయని మహాజ్ఞాని నిన్న అన్నారు.. మూర్ఖుల రాజు ఏ ప్రపంచంలో జీవిస్తున్నారో, తమ దేశ ప్రగతిని చూడలేని రోగం వారికి ఉందని కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని విమర్శించారు. ప్రపంచంలో మొబైల్ ఫోన్ల తయారీలో భారతదేశం రెండో అతిపెద్ద దేశంగా అవతరించిందని ప్రధాని తెలిపారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇంట్లో కూర్చున్నారు, వారికి బయటకు వెళ్లాలని అనిపించడం లేదని ప్రధాని అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రవంలో కాంగ్రెస్ అవినీతి, దోపిడిని అరకట్టడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధాని అన్నారు.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!