PM Modi: “మూర్ఖులకు రాజు”.. రాహుల్ గాంధీ ‘మేడ్ ఇన్ చైనా’ వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి ఈ రోజే చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించాయి. ప్రధాని నరంద్రమోడీ ఈ రోజు బీతుల్ జిల్లా బహిరంగ సమావేశంలో ప్రసంగించారు. భారీగా హాజరైన జనాలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. బీజేపీ విజయం ఖాయమైందని అన్నారు.
బుధవారం భగవాన్ బీర్సాముండా జయంతిని దేశం మొత్తం జరుపుకుంటున్న సందర్భంగా గిరిజనుల సంక్షేమం కోసం కేంద్రం రూ. 24,000 కోట్ల విలువైన పథకాన్ని ప్రారంభించనుందని నరేంద్రమోడీ మంగళవారం తెలిపారు. మధ్యప్రదేశ్ ప్రజల్లో భాజపా పట్ల అపూర్వమైన విశ్వాసం, ప్రేమానురాగాలు చూశామని, ఎన్నికల ముందు కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని ప్రధాని మోదీ అన్నారు. రేపు జనజాతీయ గౌరవ్ దివాస్, భగవాన్ బిర్సా ముండాకు నివాళులు అర్పించేందుకు రేపు జార్ఖండ్ వెళ్లనున్నట్లు, అక్కడే గిరిజనుల అభివృద్ధి కోసం కొత్త పథకాన్ని ప్రకటించనున్నట్లు ప్రధాని ప్రకటించారు.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
మోదీ హమీల ముందు కాంగ్రెస్ బూటకపు హామీలు పనికి రావని ఆ పార్టీకి అర్థమైందని, నవంబర్ 17 దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ వాదనలు బట్టబయలవుతున్నాయని, కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని, ఇప్పుడు ఆ పార్టీ అదృష్టంపై ఆధారపడుతుందని ఎద్దేవా చేశారు.
Read Also: Israel-Hamas War: గాజాపై పట్టు సాధిస్తున్న ఇజ్రాయిల్.. హమాస్ పార్లమెంట్, ప్రభుత్వ భవనాలు స్వాధీనం..
జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా చట్టం, రామ మందిర నిర్మాణం నిజమవుతాయని కాంగ్రెస్ ఎప్పుడూ నమ్మలేదని, కానీ వాటిన్నింటిని చేసి చూపించామని మోడీ అన్నారు. ప్రపంచంలో మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ రెండో స్థానంలో ఉందని, అయితే ప్రజల జేబుల్లో ‘మేడ్ ఇన్ చైనా’ ఫోన్లు ఉన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్ లో మేడ్ ఇన్ చైనా ఫోన్లు ఉన్నాయని మహాజ్ఞాని నిన్న అన్నారు.. మూర్ఖుల రాజు ఏ ప్రపంచంలో జీవిస్తున్నారో, తమ దేశ ప్రగతిని చూడలేని రోగం వారికి ఉందని కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని విమర్శించారు. ప్రపంచంలో మొబైల్ ఫోన్ల తయారీలో భారతదేశం రెండో అతిపెద్ద దేశంగా అవతరించిందని ప్రధాని తెలిపారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇంట్లో కూర్చున్నారు, వారికి బయటకు వెళ్లాలని అనిపించడం లేదని ప్రధాని అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రవంలో కాంగ్రెస్ అవినీతి, దోపిడిని అరకట్టడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధాని అన్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!