Karnataka: మారుతున్న కర్ణాటక రాజకీయ ముఖచిత్రం.. బీజేపీకి దగ్గరవుతున్న మాజీ మిత్రుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: 2024 లోక్ సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సారి బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలన్నీ కలిసి కూటమిగా ఏర్పడేందుకు చర్చలు జరుగుతున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. టీఎంసీ, ఎన్సీపీ, జేడీయూ, ఎస్పీ వంటి ప్రాంతీయ పార్టీలు విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నాయి. అందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తే ఈ సారి మోడీని గద్దె దించవచ్చని భావిస్తున్నాయి.
Also Read
ఇదిలా ఉంటే ఇన్నాళ్లు బీజేపీ అంటే అంటీముట్టనట్లు ఉన్న మాజీ ప్రధాని దేవెగౌడ పార్టీ అయిన జనతాదల్ సెక్యులర్(jds) మాత్రం బీజేపీకి దగ్గరవుతున్న వాతావరణం కనిపిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీల మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీ-జేడీఎస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఈ సారి 2024 ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 ప్రతిపక్ష ఐక్యత గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు జేడీఎస్. బీజేపీకి మాజీ మిత్రుడైన జేడీఎస్ కలిసి 2006లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2006లో ఈ రెండు పార్టీలు కలిసి సంక్షీర్ణాన్ని ఏర్పాటు చేసిన అయితే ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం.. ముఖ్యమంత్రి కుమారస్వామి, తన డిప్యూటీ అయిన యడియూరప్పకు అధికారాన్ని బదిలీ చేయకపోవడంతో ప్రభుత్వం కుప్పకూలింది.
గత నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీలు కాంగ్రెస్ చేతిలో ఓడిపోయాయి. జేడీఎస్ 224 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 19 స్థానాలను గెలిచింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో జతకడితే.. తన ఓట్ బేస్ ను కాపాడుకునే అవకాశం ఉందని జేడీఎస్ భావిస్తోంది. ఇటీవల నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్ తో పాటు అన్ని ప్రధాన విపక్ష పార్టీలు బహిష్కరించినా.. జేడీఎస్ తరుపున దేవెగౌడ హాజరయ్యారు. ఇటీవల బాలాసోర్ రైలు ప్రమాదం సమయంలో విపక్షాలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామాకు డిమాండ్ చేశాయి. అయితే ఆ సమయంలో కూడా దేవెగౌడ బీజేపీకి మద్దతుగా నిలిచారు. అశ్విని వైష్ణవ్ ని సమర్థించారు. తాజాగా విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతూ.. దేశంలో బీజేపీతో సంబంధం పెట్టుకోని ఒక్క పార్టీనైనా చూపించాలంటూ సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!