Himachal Pradesh: రసవత్తరంగా హిమాచల్ రాజకీయాలు..బీజేపీలోకి కాంగ్రెస్ అనర్హత ఎమ్మెల్యేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఆ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఈ రోజు బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఈ రోజు బీజేపీలో చేరనున్నారు. ఇటీవల రాజ్యసభ ఎంపీల ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ తరుపున క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు. దీంతో వారిపై అనర్హత వేటు వేశారు.
Read Also: Rajanna Sircilla: సిరిసిల్లలో దారుణం.. మహిళపై వలస కూలీల అత్యాచారం..హత్య..!
Also Read
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
ముగ్గురు ఇండిపెండెంట్లు – ఆశిష్ శర్మ (హమీర్పూర్ నియోజకవర్గం), హోషియార్ సింగ్ (డెహ్రా), కెఎల్ ఠాకూర్ (నాలాగర్) శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శి యశ్ పాల్ శర్మకు రాజీనామా సమర్పించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరికి బీజేపీ టికెట్లు నిరాకరించడంతో, ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. ఆ తర్వాత 40 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. ఈ ముగ్గురూ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు.
అయితే, సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తమను, తమ కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. 68 మంది ఎమ్మెల్యేలు ఉన్న హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో అధికార కాంగ్రెస్కి 40 మంది ఎమ్మెల్యేలు ఉంటే, వీరిలో ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో సంఖ్యాబలం 34కి పడిపోయింది. బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..