Balakot Airstrike: బాలాకోట్ వైమానిక దాడులకు నాలుగేళ్లు.. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్న ఇండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakot Airstrike: బాలాకోట్ దాడులకు జరిగి నాలుగేళ్ల అయింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ 2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడి పాాల్పడినందుకు గట్టిగా బుద్ది చెప్పింది. పుల్వామా ఎటాక్ లో 46 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. ఈ ఘటనపై యావత్ దేశం పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి ఘటన పాల్పడాలంటే పాక్ వెన్నులో వణుకు పుట్టేలా గుణపాఠం చెప్పాలని భారత్ భావించింది. ఈ నేపథ్యంలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ ఉగ్రవాదులను మట్టుపెట్టి వచ్చింది.
ఎయిర్ స్ట్రైక్స్ జరిగిందిలా..
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
ఫిబ్రవరి 26, 2019లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను దాటి, పాక్ మెయిన్ ల్యాండ్ లోకి వెళ్లి దాడులు చేసింది. ఈ దాడులకు నాలుగేళ్లు నిండాయి. భారత ప్రభుత్వం ఫిబ్రవరి 27న బాలాకోట్ వైమానిక దాడులను ధృవీకరించింది. రాత్రి సమయంలో 12 మిరాజ్ 2000 జెట్లు పాక్ బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేసి, వారందరిని మట్టుపెట్టాయి. ఇజ్రాయెల్ తయారు చేసిన స్పైస్ 2000 బాంబులతో భారత ఎయిర్ ఫోర్స్ భీకరదాడులు చేసింది.
తెల్లవారుజామున నియంత్రణ రేఖను దాటిన విమానాలు 3.30 గంటలకు దాడులను ప్రారంభించాయి. మిరాజ్ 2000 విమానాలు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తుంటే, పాకిస్తాన్ ఏదైనా దాడికి పాల్పడితే కౌంటర్ అటాక్ చేసేందుకు సుఖోయ్ ఎస్యూ-30 ఎంకేఐలను సిద్ధం చేసింది భారత్. దీంతో పాటు మొత్తం ఆపరేషన్కు ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానం నేత్రా సహకరించింది. ఈ దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు మరణించారు.

మిగ్ విమానంతో ఎఫ్-16ని కూల్చేసి అభినందన్..
ఈ దాడి జరిగిన తర్వాత ఫిబ్రవరి 27, 2019లో పాక్ వైమానిక దళం జమ్మూలోని రాజౌరీ సెక్టార్ లో దాడులు చేసేందుకు వచ్చాయి. అత్యాధుని అమెరికా తయారీ ఎఫ్-16 విమానాలను గుర్తించిన భారత్ వెంటనే ప్రతిదాడి చేశాయి. రష్యా తయారీ మిగ్-21 బైసన్ ను నడుపుతున్న అభినందన్ వర్థమాన్ ఎఫ్-16ని కూల్చేశాడు. ఈ సమయంలో అభినందన్ విమానం కూడా కూలిపోయి, పాకిస్తాన్ భూభాగంలో పారాశ్యూట్ సాయంతో ల్యాండ్ అయ్యాడు. అభినందన్ ను నిర్భందించిన పాక్ సైన్యం, అంతర్జాతీయ ఒత్తడి, భారత ప్రతిదాడికి భయపడి భారత్ కు అప్పగించింది. ఈ దాడిలో హైలెట్ ఏంటంటే ఒక ఎఫ్ -16 విమానాన్ని, పాత సోవియట్ తయారీ మిగ్-21 బైసన్ తో కూల్చడం.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..