Bangladesh clashes: బంగ్లాదేశ్ ఘర్షణల్లో 32 మంది మృతి.. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ..
- మరోసారి ఉద్రిక్తంగా బంగ్లాదేశ్ పరిస్థితులు..
- ప్రధాని రాజీనామా చేయాలని నిరసనలు..
- అల్లర్లలో 32 మంది మృతి..
- దేశవ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి కర్ఫ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh clashes: బంగ్లాదేశ్ వ్యాప్తంగా మరోసారి ఘర్షణలు చెలరేగాయి. ఇటీవల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు, ప్రజలు ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో 200 మందికి పైగా మృతి చెందారు. ఇదిలా ఉంటే పోలీసులు అణిచివేతకు వ్యతిరేకంగా మరోసారి ఆ దేశంలో నిరసనలు మిన్నంటాయి. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్తో నిరసనకారులు రోడ్డెక్కారు. రాజధాని ఢాకాలో నిరసనకారులు, విద్యార్థులు పోలీసులకు, అధికార అవామీ లీగ్ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 32కి మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.
Read Also: Dowry harassment: ఆఫ్రికా వ్యక్తితో పడుకోవాలని భార్యపై ఒత్తిడి.. కట్నం కోసం భర్త దురాగతం..
Also Read
నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించారు. ఘర్షణలు ఎక్కువ అవుతుండటంతో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూని ప్రకటించారు. మరోవైపు ఘర్షణలు ఎక్కువ అవుతుండటంతో ఆ దేశంలో ఉంటున్న భారతీయులు అలర్ట్గా ఉండాలని భారత్ సూచించింది. బంగ్లాదేశ్ ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మద్దతు ఉన్న విద్యార్థులు శాసనోల్లంఘనకు పిలుపునిచ్చారు. ప్రజలు పన్నులు చెల్లించొద్దని సూచించారు. ఢాకాలోని షాబాగ్ ప్రాంతంలోని ప్రధాన ఆస్పత్రి అయిన బంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ యూనివర్సిటీతో సహా పలు కార్యాలయాలపై నిరసనకారులు దాడులుకు పాల్పడ్డారు. ఢాకా ఉత్తర ప్రాంతలో బాంబు దాడులు కూడా జరిగాయి. ప్రభుత్వం హైస్పీడ్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపేసింది. 4జీ సేవల్ని నిలిపేయాలని ఆదేశాలు అందాయి.
మరోవైపు ఈ నిరసనలకు జమాలే ఇస్లామీ పార్టీ, వారి విద్యార్థి విభాగం కారణమని ప్రభుత్వం నిందించింది. ఇలా రోడ్లపైకి వచ్చే వారు విద్యార్థులు కారని, దేశాన్ని అస్థిరపరిచే ఉగ్రవాదులు అంటూ పీఎం షేక్ హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉగ్రవాదుల్ని బలంగా అణిచివేయాలని దేశ ప్రజలను కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాట కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై ఆ దేశంలో ఆందోళనలు చెలరేగాయి. అయితే, సుప్రీంకోర్టు దీనిని 5 శాతానికి తగ్గించడంతో అల్లర్లు సద్దుమణిగాయి. అయితే, ఇప్పుడు పీఎం హసీనా రాజీనామా చేయాలనే కొత్త నినాదంలో మళ్లీ నిరసనలు ప్రారంభయ్యాయి.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!