Amit Shah: పీఓకే కూడా మనదే, అక్కడ 24 సీట్లు రిజర్వ్.. జమ్మూకాశ్మీర్లో పెరిగిన సీట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీని కోసం ఈ రోజు జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్(సవరణ) బిల్లు-2023, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్(సవరణ) బిల్లు-2023 బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై రెండు రోజుల పాటు చర్చ సాగనుంది. బిల్లులలోని కీలక అంశాలను అమిత్ షా సభకు వెల్లడించారు.
Read Also: Rahul Gandhi: “రాహుల్ గాంధీకి రాజకీయ పరిపక్వత లేదు”.. ప్రణబ్ ముఖర్జీ పుస్తకంలో కీలక విషయాలు..
Also Read
- Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
- Kerala Road A*ccident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, 8 మంది మృతి
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
గతంతో పోలిస్తే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి. గతంలో జమ్మూ కాశ్మీర్ నియోజకవర్గాల సంఖ్య 83 ఉండగా.. ప్రస్తుత బిల్లులో వీటిని 90కి పెంచాలని ప్రతిపాదించారు. ఇంతకుముందు కాశ్మీర్ డివిజన్లో 46, జమ్మూ డివిజన్లో 43 అసెంబ్లీ స్థానాలు ఉండేవి, అయితే ఇప్పుడు వీటిని 47, 43కి పెంచినట్లు అమిత్ షా తెలిపారు. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) ప్రాంతంలో 24 స్థానాలను రిజర్వ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. పీఓకే కూడా భారత్లో అంతర్భాగమే అని స్పష్టం చేశారు. కాశ్మీర్లో రెండు స్థానాలను కాశ్మీర్ నుంచి వలసవెళ్లిన వాళ్లకు, ఒక స్థానాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వచ్చి స్థిరపడిన వారికి రిజర్వ్ చేసినట్లు తెలిపారు. తొలిసారిగా ఎస్సీ/ఎస్టీ వర్గాలకు 9 స్థానాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
చర్చలో భాగంగా జమ్మూ కాశ్మీర్ సమస్యలకు, పీఓకే వివాదానికి దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే కారణమని అన్నారు. ఆయన చేసిన రెండు తప్పుల మూలంగానే పీఓకే సమస్య ఏర్పడిందని, 1947 యుద్ధ సమయంలో కాల్పుల విరమణ ప్రకటించడం, భారత్ అంతర్గత విషయమైన కాశ్మీర్ వివాదాన్ని ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని ఆరోపించారు. ఈ ఆరోపణలతో కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
తాజావార్తలు
-
Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
-
POCO X8, X8 Power: పోకో ఎక్స్8 పవర్, పోకో ఎక్స్8 భారత్లో లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్, ధరలు ఇవే!
-
Dharman: రజనీకాంత్ ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ పూర్తి.. రెండు రోజుల్లోనే షూటింగ్ ఫినిష్?
-
CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
-
India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్తాన్ మహిళల టీ20 మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా లైవ్ చూడాలి?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!